
క్షణికావేశంలో తండ్రిని హత్య చేసిన కొడుకు
మేడిపల్లి: క్షణికావేశంలో కన్న కొడుకే తండ్రిని దారుణంగా హత్య చేశాడు. ఈ సంఘటన మేడిపల్లి మండలకేంద్రంలో గురువారం చోటుచేసుకుంది. కోరుట్ల సీఐ సురేశ్బాబు, మేడిపల్లి ఎస్సై సుప్రియ కథనం ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన అంగడి నర్సయ్య అలియస్ గంగారెడ్డి (56) తాగివచ్చి కొడుకు వెంకటేశ్తో ఘర్షణ పడ్డాడు. దీంతో క్షణికావేశంలో వెంకటేశ్ దగ్గరలో ఉన్న ఇనుప వస్తువుతో తండ్రి తలపై బలంగా కొట్టాడు. ఈ ఘటనలో గంగారెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. అనంతరం వెంకటేశ్ మేడిపల్లి పోలీస్స్టేషన్లో లొంగిపోయాడు. నర్సయ్య వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఆయనకు భార్య, కూతురు, కుమారుడు సంతానం. కొడుకు వెంకటేశ్ ఇటీవలే గల్ఫ్ వెళ్లి తిరిగి వచ్చి వ్యవసాయం చేసుకుంటున్నాడు. వెంకటేశ్కు ఇంకా పెళ్లి కాలేదు. ఘటన స్థలానికి చేరుకున్న సీఐ, ఎస్త్సె వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.
ఎల్ఎల్బీ 4వ సెమిస్టర్ విద్యార్థులకు ప్రత్యేక బ్యాక్లాగ్ అవకాశం
కరీంనగర్క్రైం: శాతవాహన యూనివర్సిటీ పరి ధిలో ఎల్ఎల్బీ నాల్గో సెమిస్టర్ విద్యార్థులకు బ్యాక్లాగ్ పరీక్ష ప్రత్యేక రుసుముతో అవకాశం కల్పిస్తున్నట్లు యూనివర్సిటీ ఎగ్జామినేషన్ కంట్రోలర్ డి.సురేశ్కుమార్ తెలిపారు. జూన్ 3వ తేదిలోగా తమ కళాశాలల్లో ప్రతీ పేపర్కు రూ.1500 లు చెల్లించాలని పేర్కొన్నారు.
కేంద్ర బృందం సందర్శన
కరీంనగర్: కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ ఆ ధ్వర్యంలోని మిషన్ శక్తి కేంద్ర బృందం గురువారం జిల్లాలో పర్యటించింది. పథకంలో భా గంగా జిల్లాలో ఏర్పాటు చేసిన మహిళా సాధి కారత కేంద్రం, సఖి వన్ స్టాప్ సెంటర్, శక్తి స దన్, సఖి నివాస్ విభాగాలను బృందం సభ్యులు, ఎన్ఐసీ సంయుక్త సంచాలకులు ఇహ జై న్, యంగ్ ప్రొఫెషనల్ రాహుల్ రానా, అంతరిక్ష భరద్వాజ్, మిషన్ శక్తి రాష్ట్ర విభాగం ఇన్చా ర్జి బ్లెస్సీ పరిశీలించారు. జిల్లాలో అమలవుతున్న పలు కార్యక్రమాల వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు కేంద్ర బృందానికి వివరించారు. అనంతరం జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో బృందం సభ్యులు సమీక్ష నిర్వహించారు. జిల్లాలో మిషన్ శక్తి అమలు తీరు ఆదర్శనీయమని అధికారులు, సిబ్బందిని అభినందించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు కార్యక్రమాలను రానున్న రోజుల్లో మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలు తమ దృష్టికి తీసుకురావచ్చని, సలహాలు, సూచనలు ఇవ్వవచ్చని పేర్కొన్నారు. మిషన్ శక్తి కార్యక్రమాలకు సంబంధించిన డాష్ బోర్డు, ప్రగతిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా సంక్షేమ అధికారి ఎం.సరస్వతి, సీడబ్ల్యూసీ చైర్పర్సన్ ధనలక్ష్మి, మహిళా సాధికారిక కేంద్రం జిల్లా కోఆర్డినేటర్ శ్రీలత, సఖి అడ్మిన్ లక్ష్మి, శక్తి సదన్ సూపరింటెండెంట్ రమాదేవి, డీసీపీవో పర్వీన్, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ సంపత్, పద్మపాని ఎన్జీవో నిర్వాహకులు సత్యనారాయణరెడ్డి, ప్రకృతి ఎన్జీవో నిర్వాహకులు జయశ్రీ తదితరులు పాల్గొన్నారు.