ప్రైవేట్‌ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి

May 2 2025 1:17 AM | Updated on May 2 2025 1:17 AM

ప్రైవేట్‌ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి

ప్రైవేట్‌ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలి

● కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌టౌన్‌: ప్రైవేట్‌ ఆస్పత్రులు నిబంధనలు పాటించాలని, లేనిపక్షంలో చర్యలు తప్పవని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల నిర్వహణ అనుమతులకు సంబంధించిన ‘జిల్లా రిజిస్ట్రేషన్‌ అథారిటీ’ కమిటీ సమావేశం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో గురువారం జరిగింది. కలెక్టర్‌ పమేలా సత్పతి మాట్లాడుతూ ఆస్పత్రి నుంచి వెలుపడే బయో కెమికల్‌, ప్లాస్టిక్‌ వ్యర్థాల విషయంలో నిబంధనలు పాటించాలని ఆదేశించారు. ఆస్తి పన్ను, నీటి పన్ను నిర్దిష్ట సమయంలో చెల్లించాలని పేర్కొన్నారు. నివాసయోగ్యంగా ఉన్న గృహాల్లో ఆస్పత్రులు నిర్వహిస్తున్నట్లయితే వాటిని తప్పనిసరిగా వెంటనే వాణిజ్య పరిధిలోకి మార్చుకోవాలని అన్నారు. ఫైర్‌సేఫ్టీ నిబంధనలు తప్పక పాటించాలని, ఎగ్జిట్‌, ఎంట్రీ కోసం వేరువేరుగా ప్రవేశ మార్గాలు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. సీపీ గౌస్‌ ఆలం మాట్లాడుతూ... ప్రతి ప్రైవేట్‌ ఆస్పత్రికి పార్కింగ్‌ సౌకర్యం విధిగా ఉండాలని అన్నారు. అడిషనల్‌ కలెక్టర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌ రెడ్డి, ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు ఎనమల్ల నరేశ్‌, హెచ్‌ఈవో బాలయ్య, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

ఫెయిల్‌ అయిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి

కరీంనగర్‌: పదోతరగతిలో ఫెయిల్‌ అయిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించి సప్లమెంటరీలో వందశాతం ఉత్తీర్ణత సాధించేలా శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి మండల విద్యాధికారులను ఆదేశించారు. పదో తరగతి ఫలితాలు, విద్యాశాఖలో కార్యాచరణపై కలెక్టరేట్‌లో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన 6,200 మంది విద్యార్థుల్లో 5,995మంది ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఫెయిల్‌ అయిన 205మందిపై ప్రత్యేక దృష్టి సారించి, వచ్చే నెలలో జరగనున్న సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేలా శ్రద్ధ వహించాలని ఆదేశించారు. 2015 నుంచి ఇప్పటివరకు పదోతరగతిలో సబ్జెక్టుల వారీగా ఫెయిల్‌ అయిన విద్యార్థుల డాటా సేకరించాలన్నారు. ఫెయిల్‌ అయిన సబ్జెక్టుల్లో ప్రాక్టీస్‌ చేయించి వారంతా సప్లమెంటరీలో పాస్‌ అయ్యేలా చూడాలని అన్నారు. మండల విద్యాధికారులు అన్ని పాఠశాలలను సందర్శించి కావలసిన సౌకర్యాలపై నివేదిక సమర్పించాలని సూచించారు. అడిషనల్‌ కలెక్టర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, జిల్లా విద్యాధికారి జనార్దన్‌రావు, కో–ఆర్డినేటర్లు మిల్కూరి శ్రీనివాస్‌ ఆంజనేయులు, డీసీడీవో కృపారాణి, సీడీపీవో సబిత పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement