పాకిస్తాన్‌ జెండాను కాళ్లతో తొక్కిన మైనార్టీలు | - | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌ జెండాను కాళ్లతో తొక్కిన మైనార్టీలు

Apr 30 2025 1:58 AM | Updated on Apr 30 2025 1:58 AM

పాకిస

పాకిస్తాన్‌ జెండాను కాళ్లతో తొక్కిన మైనార్టీలు

రాయికల్‌: జమ్ముకశ్మీర్‌లోని పహెల్గమ్‌లో యాత్రికులపై ఉగ్రవాదుల దాడికి నిరసనగా మంగళవారం జగిత్యాల జిల్లా రాయికల్‌ పట్టణంలోని మైనార్టీలు, యువజన సంఘం సభ్యులు స్థానిక పాతబస్టాండ్‌లో పాకిస్తాన్‌ జాతీయ జెండాను చించివేసి కాళ్లతో తొక్కారు. మైనార్టీలు మాట్లాడుతూ.. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను వెంటనే అంతమొందించి దేశాన్ని కాపాడాలని కోరారు. దేశంలో మైనార్టీలు, హిందువులంతా ఒక్కటేనని పిలుపునిచ్చారు.

గుండెపోటుతో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ మృతి

జగిత్యాలరూరల్‌: జగిత్యాల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌, తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన గడ్డం దశరథరెడ్డి (75) మంగళవారం గుండెపోటుతో మృతిచెందారు. విషయం తెలుసుకున్న జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన మృతిపట్ల వివిధ పార్టీల నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

మామిడి చెట్టుపై నుంచి పడి కూలీ..

జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్‌ మండలం అంతర్గాం శివారులో మామిడికాయలు తెంపుతుండగా.. ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి సీతారాం సాయక్కర్‌ (57) మృతిచెందాడు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం బృహంపూర్‌ జిల్లా నవాలా గ్రామానికి చెందిన సాయక్కర్‌ కొన్నాళ్ల క్రితం పట్టణానికి వచ్చి దినసరి కూలీగా పనిచేస్తున్నాడు. మామిడికాయలు తెంపేందుకు కూలికి వెళ్లి చెట్టు కొమ్మ విరిగి కింద పడటంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. మృతుడి బంధువు పరిమళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్సై సదాకర్‌ తెలిపారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్మాస్‌పూర్‌కు చెందిన ఆటోడ్రైవర్‌ నీరంక శంకర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ఘటన స్థలం నుంచి క్షతగాత్రుడిని 108 వాహనంలో సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. శంకర్‌ తన తల్లి ఏడాది క్రితం మృతిచెందడంతో సంవత్సరీకం చేయడానికి సరుకులు తీసుకొచ్చేందుకు వెంకటాపూర్‌ వెళ్తున్నాడు. అదే సమయంలో సిరిసిల్ల నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న కారు వెంకటాపూర్‌ శివారులో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శంకర్‌ కుడికాలు విరిగింది. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

పెంపుడు కుక్కకు అంత్యక్రియలు

మెట్‌పల్లిరూరల్‌: అల్లారుముద్దుగా పెంచుకున్న శునకం మృతి చెందడంతో దిగులు చెందిన యజమాని అంతిమ సంస్కారాలు నిర్వహించిన ఘటన మెట్‌పల్లి మండలం బండలింగాపూర్‌లో జరిగింది. గ్రామానికి చెందిన కై ర రవి మూడేళ్ల క్రితం బెంగళూర్‌లో జర్మన్‌షేప్‌ శునకాన్ని రూ.16 వేలకు కొన్నాడు. దానికి లీయో అనే పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. ఆది మంగళవారం ఉదయం అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోయింది. దాని మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు పోస్ట్‌మార్టం కోసం కోరుట్ల పశువైద్య కళాశాల వైద్యులను సంపద్రించాడు. హైదరాబాద్‌లో పోస్ట్‌మార్టం చేయిస్తే కారణం తెలుస్తుందని వారు చెప్పడంతో తన ప్రయత్నాన్ని విరమించుకుని సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు నిర్వహించాడు.

పాకిస్తాన్‌ జెండాను కాళ్లతో తొక్కిన మైనార్టీలు1
1/2

పాకిస్తాన్‌ జెండాను కాళ్లతో తొక్కిన మైనార్టీలు

పాకిస్తాన్‌ జెండాను కాళ్లతో తొక్కిన మైనార్టీలు2
2/2

పాకిస్తాన్‌ జెండాను కాళ్లతో తొక్కిన మైనార్టీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement