లైంగిక వేధింపులు ఉంటే తెలియజేయాలి | - | Sakshi
Sakshi News home page

లైంగిక వేధింపులు ఉంటే తెలియజేయాలి

Apr 26 2025 12:09 AM | Updated on Apr 26 2025 12:09 AM

లైంగి

లైంగిక వేధింపులు ఉంటే తెలియజేయాలి

కరీంనగర్‌క్రైం: విద్యార్థిదశలో లైంగిక వేధింపులకు గురైతే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా మిత్రులకు తెలియజేయాలని లేదంటే భవిష్యత్తులో సమస్యలు ఎదుర్కొవాల్సి వ స్తుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి కె.వెంకటేశ్‌ సూచించారు. శుక్రవారం కరీంనగర్‌ సిటీలోని ప్రభుత్వ వృద్ధులు, వికలాంగుల ఆశ్రమాలు, స్వధార్‌ హోమ్‌ను పరిశీలించారు. ఆహార పదార్థాలు నిలువచేసే గదులను తనిఖీ చేశారు. పరిశుభ్రత పాటించాలని నిర్వాహకులకు జడ్జి సూచించారు. ఎలాంటి న్యాయపరమైన సహాయం, న్యాయసేవలు అవసరమున్నా..తమను సంప్రదించాలన్నారు.

విజిబుల్‌ పోలీసింగ్‌పై దృష్టి సారించాలి

సీపీ గౌస్‌ ఆలం

గంగాధర: విజిబుల్‌ పోలీసింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, సిబ్బంది తమ పరిధిలో ఉన్న గ్రామాలను క్రమం తప్పకుండా సందర్శించి ప్రజలతో మమేకం కావాలని కరీంనగర్‌ సీపీ గౌస్‌ ఆలం సూచించారు. గంగాధర పోలీస్‌ స్టేషన్‌ను శుక్రవారం సాయంత్రం తనిఖీ చేశారు. పోలీస్‌ స్టేషన్‌లో పెండింగ్‌లో ఉన్న కేసులపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌కు సంబంధించిన వివరాలను సిబ్బందినడిగి తెలుసుకున్నారు. రౌడీ షీటర్లు, హిస్టరీ షీటర్లపై ప్రత్యేకంగా నిఘా ఉంచాలని, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనిస్తుండాలన్నారు. ఎస్సై వంశీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

రేషన్‌కార్డుల జారీ వేగవంతం చేయాలి

నగరపాలకసంస్థ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పేయ్‌

కరీంనగర్‌కార్పొరేషన్‌: రేషన్‌కార్డుల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని నగరపాలకసంస్థ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పేయ్‌ ఆదేశించారు. శుక్రవారం నగరపాలకసంస్థ కార్యాలయంలోని సమావేశ మందిరంలో వార్డు అధికారులతో సమావేశం నిర్వహించారు. రేషన్‌కార్డులను త్వరగా లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు నూతన రేషన్‌కార్డులు, పేర్ల నమోదుకు చేసుకున్న దరఖాస్తుల పరిశీలన చేపట్టాలన్నారు. డివిజన్లవారీగా దరఖాస్తులను పరిశీలించి, అర్హులైన లబ్ధిదారులను గుర్తించాలన్నారు. ఐదుశాతం రాయితీతో ఆస్తి పన్ను చెల్లింపులపై దృష్టి సారించాలని, గడువులోగా కనీసం 25శాతం లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు. అండర్‌ అసెస్‌మెంట్‌లను గుర్తించి రివైజ్డ్‌ చేయాలని సూచించారు. అన్‌ అసెస్‌మెంట్లు ఉంటే అసెస్‌మెంట్‌ పరిధిలోకి తీసుకురావాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్లు స్వరూపరాణి, ఖాదర్‌ మొహియొద్దీన్‌, పౌరసరఫరాలశాఖ అధికారి నర్సింహరావు, రెవెన్యూఅధికారి శ్రీనివాస్‌, నగరపాలకసంస్థ ఆర్‌వో భూమానందం పాల్గొన్నారు.

సుఖ ప్రసవాల సంఖ్య పెంచాలి

డీఎంహెచ్‌వో వెంకటరమణ

హుజూరాబాద్‌/ఇల్లందకుంట: సాధారణ ప్రసవాలకు ప్రోత్సహించాలని డీఎంహెచ్‌వో వెంకటరమణ వైద్య సిబ్బందిని ఆదేశించారు. హుజూరాబాద్‌ మండలంలోని చెల్పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, వావిలాల పీహెచ్‌సీని శుక్రవారం తనిఖీ చేశారు. సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దన్నారు. అనంతరం వావిలాల పీహెచ్‌సీ ఆద్వర్యంలో గ్రామంలో మలేరియా దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. చెల్పూరు వైద్యాధికారి మధు, డిస్ట్రిక్ట్‌ హెల్త్‌ ఎడ్యుకేటర్‌ ప్రతాప్‌ వావిలాల వైద్యాధికారి రాజేశ్‌, డాక్టర్లు చందన, హిమబిందు, సంధ్యారాణి, సఽంధ్యా, ఫర్హానుద్దీన్‌, కార్తీక్‌, విజయ్‌ పాల్గొన్నారు.

లైంగిక వేధింపులు ఉంటే తెలియజేయాలి1
1/2

లైంగిక వేధింపులు ఉంటే తెలియజేయాలి

లైంగిక వేధింపులు ఉంటే తెలియజేయాలి2
2/2

లైంగిక వేధింపులు ఉంటే తెలియజేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement