జంక్షన్‌.. అటెన్షన్‌! | - | Sakshi
Sakshi News home page

జంక్షన్‌.. అటెన్షన్‌!

Apr 24 2025 12:19 AM | Updated on Apr 24 2025 12:19 AM

జంక్ష

జంక్షన్‌.. అటెన్షన్‌!

● సిటీ శివారులో ప్రమాదకరంగా మారిన చౌరస్తాలు ● నగరం విస్తరిస్తున్న కొద్దీ పెరుగుతున్న జంక్షన్లు ● తీగలవంతెన, ఎన్టీఆర్‌ విగ్రహం, పద్మనగర్‌లో పొంచి ఉన్న ప్రమాదం ● బ్లాక్‌స్పాట్లుగా సదాశివపల్లి, చింతకుంట జంక్షన్లు

కరీంనగరం రోజురోజుకు విస్తరిస్తోంది. స్మార్ట్‌సిటీగా ఎంపికవడం, రూ.వందల కోట్ల నిధులు రావడంతో అద్దాల్లాంటి రోడ్లు, ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్‌ సిగ్నళ్లు, అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీలు, స్మార్ట్‌ టాయ్‌లెట్లు సమకూరాయి. అయితే, నగరంలో పెరుగుతున్న వాహనాలకు అనుగుణంగా జంక్షన్లు మాత్రం విస్తరణ, ఆధునీకరణకు నోచుకోకపోవడంతో ప్రమాదకరంగా పరిణమించాయి. జంక్షన్లు, రోడ్ల నిర్మాణంలో ఇంజినీరింగ్‌ లోపాలు వెరసి అక్కడక్కడ పలు ప్రమాదాలు చోటుచేసుకోగా.. కొందరు ప్రాణాలు సైతం కోల్పోయారు. ప్రజల ప్రాణాలకు ఇబ్బంది కరంగా మారిన ఆయా జంక్షన్లలో లోపాల సరిదిద్దకపోవడంతో భయంభయంగా ప్రయాణం సాగిస్తున్నారు. జిల్లా రోడ్డు సెఫ్టీ కమిటీ చైర్‌పర్సన్‌గా ఉన్న కలెక్టర్‌ ఈ జంక్షన్ల విస్తరణపై దృష్టిసారించాల్సిన అవసరం ఉంది.

–సాక్షిప్రతినిధి,కరీంనగర్‌

సదాశివపల్లి..

సదాశివపల్లి జంక్షన్‌ అత్యంత ప్రమాదకరంగా మారింది. వరంగల్‌ నుంచి అలుగునూరు వెళ్లే క్రమంలో సదాశివపల్లి స్టేజీ వద్ద కుడివైపు రోడ్డు చీలి తీగలవంతెనకు వెళ్తుంది. ఇక్కడే వాహనదారులు గందరగోళానికి గురవుతున్నారు. వరంగల్‌, అలుగునూరు, తీగలవంతెన మీద నుంచి వచ్చే వాహనాలు ఆచితూచి వెళ్లాల్సి ఉంటుంది. ఏమాత్రం ఏమరుపాటుగా ఉంటే భారీ ప్రమాదాలకు పుష్కలంగా అవకాశాలున్నాయి. మరీ ముఖ్యంగా సదాశివపల్లి గ్రామస్తులు జీబ్రాక్రాసింగ్‌ లేక రోడ్డు దాటేందుకు బెంబేలెత్తుతున్నారు. అత్యవసరంగా ఇక్కడ భూసేకరణ జరిపి జంక్షన్‌ ఐలాండ్‌, ట్రాఫిక్‌ సిగ్నల్స్‌, జీబ్రా క్రాసింగ్‌ ఏర్పాటు చేయాల్సిన అవసరముంది.

చింతకుంట..

కరీంనగర్‌ నుంచి సిరిసిల్ల వెళ్లే దారిలో చింతకుంట ఎస్సారెస్పీ కాలువకు ముందు కుడివైపు మల్కాపూర్‌క రోడ్డు ఉంది. ఇక్కడ భారీ వాహనాలు మల్కాపూర్‌ వెళ్లేందుకు మలుపులు తీసుకుంటాయి. మరికొన్ని యూనివర్సిటీ, కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌ వైపు వెళ్లేందుకు యూటర్న్‌ తీసుకుంటాయి. ఇది కూడా అత్యంత ప్రమాదకరంగా మారింది. సిరిసిల్ల నుంచే వచ్చే వాహనదారులకు ఇక్కడ జంక్షన్‌ ఉందన్న విషయం తెలియదు. అదే సమయంలో యూటర్న్‌ను తప్పించుకునేందుకు చింతకుంట గ్రామస్తులు రాంగ్‌రూట్‌లో సిరిసిల్ల నుంచి వచ్చే వాహనాలకు ఎదురెళ్తున్నారు. దీనికితోడు ఈ మార్గంలో మద్యం విక్రయాలు, బెల్టుషాపులు పెరగడంతో ఈ ఏరియా బ్లాక్‌స్పాట్‌గా మారిందని స్థానికులు వాపోతున్నారు. ఇక్కడ కూడా జంక్షన్‌, సిగ్నలింగ్‌ చేపట్టాలని కోరుతున్నారు.

జంక్షన్‌.. అటెన్షన్‌!1
1/2

జంక్షన్‌.. అటెన్షన్‌!

జంక్షన్‌.. అటెన్షన్‌!2
2/2

జంక్షన్‌.. అటెన్షన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement