భళా.. బాలిక | - | Sakshi
Sakshi News home page

భళా.. బాలిక

Apr 23 2025 8:21 AM | Updated on Apr 23 2025 8:37 AM

భళా..

భళా.. బాలిక

● ఇంటర్‌ ఫలితాల్లో సత్తాచాటిన అమ్మాయిలు ● రాష్ట్రస్థాయిలో ఆరోస్థానంలో కరీంనగర్‌ ● సెకండియర్‌లో 73.81, ఫస్టియర్‌లో 69.84శాతం ఉత్తీర్ణత
ఇంటర్‌ ఫలితాలు ఇలా

కరీంనగర్‌:

ఇంటర్మీడియట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. సెకండిర్‌లో 73.81, ఫస్టియర్‌లో 69.84శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రస్థాయిలో ఆరోస్థానంలో నిలిచారు. ఓవరాల్‌గా బాలికలే పైచేయి సాధించారు. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో గతేడాది 74.39శాతం ఉత్తీర్ణత నమోదు చేసుకుని రాష్ట్రంలో జిల్లా 4వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. ఈసారి 73.81 శాతంతో 6వ స్థానంలో నిలిచింది. జనరల్‌, ఒకేషనల్‌ కలుపుకుని 15,187 మంది విద్యార్థులు పరీక్ష రాస్తే 11,092 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జనరల్‌ విభాగంలో బాలురు 7,133 మంది పరీక్షలకు హాజరు కాగా 4,863మంది పాసయ్యారు. 68.18 ఉత్తీర్ణతశాతం నమోదైంది. బాలికల విభాగంలో 6,789మంది పరీక్ష రాయగా.. 5,413 మంది ఉత్తీర్ణత సాధించి 79.73శాతం నమోదు చేసుకున్నారు. మొత్తంగా 13,922మంది పరీక్ష కు హాజరు కాగా 10,276మంది ఉత్తీర్ణత సా ధించారు. ఒకేషనల్‌లో జిల్లావ్యాప్తంగా 1,265 మంది పరీక్షలు రాయగా.. 816 మంది ఉత్తీర్ణులయ్యారు. 64.51శాతం ఫలితాలు నమోదు చే శారు. బాలుర విభాగంలో 687మందికి 324 మంది ఉత్తీర్ణత(47.16శాతం) సాధించారు. బాలికలు 578మంది హాజరు కాగా 492 మంది ఉత్తీర్ణత(85.12శాతం) సాధించారు.

ఫస్టియర్‌లో 11,358మంది ఉత్తీర్ణత

ఇంటర్‌ ఫస్టియర్‌లో జిల్లావ్యాప్తంగా 16,264 మంది పరీక్షలకు హాజరు కాగా 11,358 మంది ఉత్తీర్ణులయ్యారు. గతేడాది 63.41 శాతంతో రాష్ట్రంలో 5వ స్థానంలో నిలవగా.. ఈసారి 69.84శాతం ఉత్తీర్ణత సాధించి 6వ స్థానంలో నిలిచింది. బాలుర విభాగంలో 8,634మంది పరీక్షలకు హాజరు కాగా 5,356మంది(62.03 శాతం)ఉత్తీర్ణత సాధించారు. బాలికల విభా గంలో 7,630మంది పరీక్షలు రాయగా 6,002 మంది (78.66) ఉత్తీర్ణత సాధించారు. బాలుర ఉత్తీర్ణత 62.03శాతం కాగా.. బాలికల ఉత్తీర్ణత 78.66శాతంగా నమోదైంది. ఒకేషన్‌ విద్యార్థులు 51.18శాతం ఉత్తీర్ణత నమోదు చేసుకుని రాష్ట్రంలో 25వ స్థానంలో నిలిచారు. బాలుర విభాగంలో 896మంది పరీక్షలకు హాజరుకాగా 331మంది (36.94శాతం)ఉత్తీర్ణులయ్యారు. బాలికల విభాగంలో 634మందికి 452మంది విద్యార్థినులు(71.29)ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 1,530మంది పరీక్షలకు హాజరుకాగా 783 ది విద్యార్థులు 51.18 ఉత్తీర్ణతశాతం నమోదు చేసుకున్నారు.

ఈ ఏడాది ఫస్టియర్‌ ఉత్తీర్ణత శాతం

గతేడాది సెకండియర్‌ ఉత్తీర్ణత శాతం

74.39

69.84

గతేడాది ఫస్టియర్‌ ఉత్తీర్ణత శాతం

ఈ ఏడాది సెకండియర్‌ ఉత్తీర్ణత శాతం

63.41

73.81

మే 22 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

ఈనెల 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు రీవెరిఫికేషన్‌, రీవాల్యుయేషన్‌తో పాటు ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్‌కు పేపర్‌కు రూ.100, రీ వెరిఫికేషన్‌కు రూ.600 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. మే 22నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌, సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి. ఫెయిలైన విద్యార్థులు ఎలాంటి బెంగ లేకుండా సప్లమెంటరీ పరీక్షలకు హాజరు కావాలి.

– జగన్మోహన్‌రెడ్డి, డీఐఈవో, కరీంనగర్‌

భళా.. బాలిక1
1/1

భళా.. బాలిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement