
యాదాద్రి జిల్లాలో మామిడిపల్లివాసి మృతి
కోనరావుపేట(వేములవాడ): కోనరావుపేట మండలం మా మిడిపల్లి గ్రామానికి చెందిన తీపిరెడ్డి సుదర్శన్రెడ్డి(55) యా దాద్రి భువనగిరి జిల్లాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు తెలిసింది. మామిడిపల్లికి చెందిన తీపిరెడ్డి దేవరెడ్డి–కమలవ్వ దంపతుల కుమారుడు సుదర్శన్రెడ్డి కొన్నేళ్లుగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉంటున్నా డు. మావోయిస్టు, మాజీ నక్సలైట్ పేరుతో సెటిల్మెంట్లు, రియల్ఎస్టేట్, పలువురిని బెదిరించిన ఘ టనలున్నాయి. కొన్నేళ్ల క్రితం గ్రామం నుంచి వెళ్లిపోయిన సుదర్శన్రెడ్డి హైదరాబాద్ వెళ్లి ఆత్మరక్షణ కో సం గన్ లైసెన్స్ తీసుకున్నాడు. 2000 సంవత్సరంలో హైదరాబాద్లో రివాల్వర్ కొనుగోలు చేసి సెటిల్మెంట్లు, రియల్ ఎస్టేట్ చేసి అప్పులపాలయ్యాడు. 2024 మే లో మావోయిస్ట్నని సిరిసిల్లలోని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడికి ఫోన్చేసి డబ్బు డిమాండ్ చేయగా బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. 2024 అక్టోబర్లో వనపర్తి జిల్లా రైస్మిల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడికి డబ్బుల కోసం ఫోన్ చేసి పోలీసులకు చిక్కాడు. వీటితో పాటు పలు రకాల కేసులు న మోదై ఉన్నాయి. మోత్కూరు మండలం పొడిచేడు గ్రామ బస్టాండ్ పక్కన మృతిచెంది ఉన్నట్లు ఆది వారం సమాచారం అందింది. మృతుడికి భార్య, కొ డుకు, కూతురు ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉండగా, కూతురు ఎంబీబీఎస్ చదువుతోంది.