మహిళా హక్కుల సాధనకు పోరాటాలను ఉధృతం చేస్తాం | - | Sakshi
Sakshi News home page

మహిళా హక్కుల సాధనకు పోరాటాలను ఉధృతం చేస్తాం

Apr 18 2025 1:37 AM | Updated on Apr 18 2025 1:37 AM

మహిళా

మహిళా హక్కుల సాధనకు పోరాటాలను ఉధృతం చేస్తాం

కరీంనగర్‌: మహిళా హక్కుల పరిరక్షణ సాధనే లక్ష్యంగా, అంబేడ్కర్‌, పూలే ఆశయాల సాధన దిశగా ఐద్వా తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర సాగుతుందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. మహిళా హక్కుల పరిరక్షణ యాత్ర గురువారం హన్మకొండ, హుజూరాబాద్‌ మీదుగా కరీంనగర్‌కు చేరుకోగా.. తెలంగాణ చౌక్‌లో ఐద్వా కరీంనగర్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. దేశంలో మహిళలకు అడుగడుగునా ఆటంకాలే ఎదురవుతున్నాయని అన్నారు. యాత్రకు సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు గుడికందుల సత్యం, రైతు సంఘం అధ్యక్షుడు వర్ణ వెంకటరెడ్డి, కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు సాగర్‌, డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.తిరుపతి, నరేశ్‌పటేల్‌ సంపూర్ణ మద్దతు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్‌.అరుణ జ్యోతి, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కేఎన్‌ ఆశలత, నల్లిగంటి రత్నమాల, జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి నాగమణి, ఉపాధ్యక్షురాలు ధ్యావా అన్నపూర్ణ, పాండ్రాళ్ల దేవేంద్ర, నగర కార్యదర్శి చేనిరోజా, సహాయ కార్యదర్శి మంచినీళ్ల లావణ్య, జిల్లా కమిటీ సభ్యులు ఉప్పునూటి లక్ష్మి, మేదర నాగమణి, టి.భవాని, ఎం.రామ, గొలుసుల రజిని, పోతర్ల మానస, తారపాకల మున్న, అంజలి పాల్గొన్నారు.

24 నుంచి సెమిస్టర్‌ పరీక్షలు

కరీంనగర్‌సిటీ: శాతవాహన విశ్వవిద్యాలయం బీ ఫార్మసీ పరీక్షల ప్రణాళికను విడుదల చేసిందని, రెండవ, నాలుగో సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 24నుంచి 30వరకు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికారి సురేశ్‌కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఎం ఫార్మసీ మొదటి సెమిస్టర్‌ పరీక్షలు ఈనెల 24నుంచి 28వరకు జరగనున్నాయన్నారు. మరిన్ని వివరాలకు ఆయా కళాశాలలో సంప్రదించాలని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్‌ కంప్లీట్‌ చేయండి

కరీంనగర్‌ అర్బన్‌: జిల్లాలోని 15 మండలాల్లో పైలట్‌ గా ఎంపిక చేసిన గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల మార్కింగ్‌ ప్రక్రియ100 శాతంపూర్తి చేయాలని, రెండో దఫా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేయాలని అడిషనల్‌ కలెక్టర్‌ ప్రఫుల్‌ దేశాయ్‌ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో రివ్యూ నిర్వహించారు. పైలెట్‌ ప్రాజెక్టు కింద ఎంపిక చేసిన 15 గ్రామాలలో 2027 మందికి ఇళ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. 730 ఇండ్లకు మార్కింగ్‌ పూర్తయిందని తెలిపారు. 114 ఇండ్లు బేస్మెంట్‌ లెవెల్‌ కు చేరాయన్నారు. రెండోదఫా ఇండ్లను గ్రామాలు, మున్సిపల్‌ వార్డులవారీగా మంజూరు చేసేందుకు అలాట్మెంట్‌ జాబితా తయారు చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో పొరపాట్లు జరగొద్దని.. వచ్చిన దరఖాస్తుల్లో నిరుపేదలకు మాత్రమే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. అడిషనల్‌ కలెక్టర్‌ లక్ష్మీకిరణ్‌, జెడ్పీ సీఈవో శ్రీ నివాస్‌, డీటీడీవో పవన్‌ కుమార్‌ పాల్గొన్నారు.

అడ్మిషన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

కరీంనగర్‌: 2025–26 విద్యాసంవత్సరానికి రెప్యూటెడ్‌ జూనియర్‌ కళాశాలల స్కీం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, వికలాంగులు, మైనార్టీ విద్యార్థులకు ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో అడ్మిషన్లు కల్పించేందుకు గాను జిల్లాలోని ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలల నుంచి రెప్యూటెడ్‌ జూనియర్‌ కళాశాలలను నూతనంగా ఎంపిక చేసేందుకు రెసిడెన్షియల్‌ వసతి కలిగిన విద్యాబోధనలో ఉన్నత ప్రమాణాలు కలిగి కాంపిటేటివ్‌ పరీక్షల్లో ఎక్కువ సంఖ్య ఉత్తీర్ణత శాతం కలిగిన రెప్యూటెడ్‌ జూనియర్‌ కళాశాలల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ అధికారి నగైలేశ్వర్‌ తెలిపారు. ఆసక్తి ఉన్న కళాశాలలు తమ కళాశాలల అకాడమిక్‌ ప్రొఫైల్‌తోపాటు ఈ–పాస్‌ వెబ్‌ సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో తమ కళాశాలల ఈ–పాస్‌ యూజర్‌ ఐడీ పాస్‌ వర్డ్‌తో లాగిన్‌ అయి తమ కళాశాలలను రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 30 లోపు రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని, రిజిస్ట్రేషన్‌లో వివరాలను నమోదు చేసి మే 1 సాయంత్రం 5 గంటల్లోగా ఉప సంచాలకులు షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమర్పించాలని సూచించారు.

మహిళా హక్కుల సాధనకు పోరాటాలను ఉధృతం చేస్తాం 
1
1/2

మహిళా హక్కుల సాధనకు పోరాటాలను ఉధృతం చేస్తాం

మహిళా హక్కుల సాధనకు పోరాటాలను ఉధృతం చేస్తాం 
2
2/2

మహిళా హక్కుల సాధనకు పోరాటాలను ఉధృతం చేస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement