
రాజన్న ఆలయంలో భక్తులు
వేములవాడ/కొండగట్టు: సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సోమ, మంగళవారాల్లో వేములవాడ రాజన్న, కొండగట్టు అంజన్న ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. రాజన్నను దాదాపు లక్ష మంది భక్తులు దర్శించుకున్నారు. ఒక్కో భక్తుడి దర్శనానికి సుమారు ఐదు గంటల సమయం పట్టింది. రద్దీని గమనించిన ఆలయ అధికారులు గర్భగుడి దర్శనాలు రద్దు చేశారు. అలాగే కొండగట్టు అంజన్నను మంగళవారం సుమారు పదివేల మంది దర్శించుకున్నట్లు ఆలయ వర్గాలు పేర్కొన్నాయి. ఆలయ అధికారులు, పోలీసులు, సిబ్బంది భక్తులకు అందుబాటులో ఉన్నారు.

కొండగట్టు ఆలయంలో భక్తులు

కోడె మొక్కు చెల్లించుకుంటున్న భక్తులు

అంజన్నకు మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు