క్రమశిక్షణతో పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

క్రమశిక్షణతో పనిచేయాలి

Jun 7 2025 1:04 AM | Updated on Jun 7 2025 1:04 AM

క్రమశిక్షణతో పనిచేయాలి

క్రమశిక్షణతో పనిచేయాలి

కామారెడ్డి క్రైం : క్రమశిక్షణతో పనిచేసి గుర్తింపు తెచ్చుకోవాలని ఎస్పీ రాజేశ్‌ చంద్ర సూచించారు. జిల్లాలో దీర్ఘకాలంగా ఒకేచోట పనిచేస్తున్న 79 మంది హోంగార్డులకు స్థానచలనం కల్పించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రాజేశ్‌ చంద్ర ఆధ్వర్యంలో శుక్రవారం కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీల ప్రక్రియను చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మూడేళ్లకంటే ఎక్కువ కాలం ఒకే పోలీస్‌ స్టేషన్‌లో గానీ, పోలీసు కార్యాలయాల్లో గానీ విధులు నిర్వహిస్తున్న హోంగార్డులను బదిలీ చేశామన్నారు. హోంగార్డుల సీనియారిటీ, ఆరోగ్య పరిస్థితులు, కోరుకునే పీఎస్‌లులాంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా బదిలీలు నిర్వహించామన్నారు. ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నా, స్వయంగా ఆఫీసులో వచ్చి తనను సంప్రదించి పరిష్కరించుకోవాలని సూచించారు. పోలీస్‌ ఉద్యోగంలో క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఒక్కరి తప్పు మొత్తం శాఖపై ప్రభావం చూపుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. హోంగార్డులు తమకు కేటాయించిన విభాగాల్లో నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ యాకూబ్‌రెడ్డి, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ తిరుపయ్య, ఆర్‌ఐలు నవీన్‌ కుమార్‌, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఎస్పీ రాజేశ్‌ చంద్ర

79 మంది హోంగార్డులు బదిలీ

మరో కానిస్టేబుల్‌పై సస్పెన్షన్‌ వేటు

కామారెడ్డి క్రైం: మూడు రోజుల వ్యవధిలో ని జాంసాగర్‌ ఠాణాలో పని చేస్తున్న మరో కానిస్టేబుల్‌ సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఎలాంటి అను మతి లేకుండా విధులకు గైర్హాజరు కావడమే కా కుండా అతిగా మద్యం సేవించి పోలీసులకు ప ట్టుబడిన వ్యవహారంలో ఓ కానిస్టేబుల్‌ను స స్పెండ్‌ చేస్తూ ఎస్పీ రాజేశ్‌ చంద్ర శుక్రవారం ఉ త్తర్వులు జారీ చేశారు. వివరాలిలా ఉన్నాయి. ని జాంసాగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తు న్న ఎస్‌.రాకేష్‌ గౌడ్‌ అనే కానిస్టేబుల్‌ ఈనెల 5 న అనుమతి లేకుండా విధులకు డుమ్మా కొట్టా డు. అతిగా మద్యం సేవించి కారు నడిపిస్తూ కా మారెడ్డి వైపు వస్తుండగా.. తాడ్వాయి మండలం ఎర్రాపహాడ్‌ సమీపంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. తా డ్వాయి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కానిస్టేబుల్‌ రాకేష్‌ గౌడ్‌ మద్యం మత్తులో ఉన్న ట్లు గుర్తించారు. డ్రంకెన్‌ డ్రైవ్‌ పరీక్ష చేసి ఉన్నతాధికారులకు నివేదించారు. దీంతో ఎస్పీ రాజేశ్‌ చంద్ర అతడిపై సస్పెన్షన్‌ వేటు వేశారు. క్రమశిక్ష ణ తప్పితే ఉపేక్షించేది లేదని ఎస్పీ పేర్కొన్నా రు. విధుల్లో నిర్లక్ష్యం కారణంగా రెండు రోజుల క్రితం ఇదే పీఎస్‌కు చెందిన కానిస్టేబుల్‌ మోహ న్‌ సింగ్‌ సస్పెన్షన్‌కు గురైన విషయం తెలిసిందే.

విధులకు డుమ్మా.. ఆపై డ్రంకెన్‌ డ్రైవ్‌

చర్యలు తీసుకున్న ఎస్పీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement