
ఎస్సెస్సీ టాపర్లకు సన్మానం
కామారెడ్డి టౌన్ : ఎస్సెస్సీలో స్టేట్ టాపర్లుగా నిలిచిన విద్యార్థులను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ గురువారం తన చాంబర్లో సన్మానించారు. 596 మార్కులు సాధించిన నిమ్మ అన్షితతో పాటు 590 మార్కులు సాధించిన కొండ గాయత్రి, శ్రేణితను ఘనంగా సన్మానించారు. ఎస్పీఆర్ స్కూల్ కరస్పాండెంట్ మారుతి, టీచర్లు పాల్గొన్నారు.
భూ భారతితో
సమస్యలకు పరిష్కారం
నిజాంసాగర్(జుక్కల్) : భూ భారతితో భూ ముల సమస్యలు పరిష్కారమవుతాయని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు అన్నారు. జుక్కల్లోని క్యాంపు కార్యాలయానికి గురువారం వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతులు తాము ఎదుర్కొంటున్న భూ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టాపాస్ పుస్తకాలతోపాటు సాదాబైనామా తదితర సమస్యలకు భూభారతితో పరిష్కారం లభిస్తుందన్నారు. ధరణి కారణంగా పాస్పుస్తకాలు లేక ఎంతో మంది రైతులు రైతుబంధు, రైతుబీమాకు దూరమయ్యారని రైతులు అన్నారు. భూముల సమస్యలను తెలుసుకునేందుకు గ్రామాల వారీగా అధికారులు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసి, పరిష్కారం చూపిస్తారన్నారు.
సమ్మె విరమణ
భిక్కనూరు : యూనివర్సీటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారని కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణగుప్తా అన్నారు. సౌత్ క్యాంపస్లోని దీక్షాశిబిరం వద్ద గురువారం ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం తరఫున సీఎంను కలిసి సమస్యలను వివరించగా పరిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందించారని, దీంతో సమ్మె విరమిస్తున్నామన్నారు. ప్రిన్సిపాల్ సుధాకర్గౌడ్ కాంట్రాక్ట్ అధ్యాపకులకు నిమ్మరసం అందజేసి సమ్మెను విరమింపజేశారు. అధ్యాపకురాలు ప్రతిజ్ఞ, కాంట్రాక్ట్ అధ్యాపకులు సరిత, యాలాద్రి, సునీత, నర్సయ్య, రమాదేవి, వైశాలి, శ్రీకాంత్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం
కామారెడ్డి టౌన్: కేంద్ర కేబినెట్ జనగణనతో పాటు కులగణన నిర్ణయం తీసుకోవడాన్ని హర్షిస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి నాయకులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ చేపట్టిన కులగణన తప్పుల తడకగా ఉందని, ప్రస్తుతం కేంద్రం చేపట్టబోయే జనగణన, కులగణనతో పూర్తి స్పష్టత వస్తుందన్నారు. దేశాభివృద్ధి కేవలం బీజేపీతోనే సాధ్యమని అన్నారు. ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు తోట బాలరాజు, పట్టణ అధ్యక్షుడు ఉప్పు లక్ష్మీపతి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రంజిత్ మోహన్, నాయకులు పోతరాజు వెంకటేశ్, గోపు స్వామి, శ్రీకాంత్, గోవర్ధన్ పాల్గొన్నారు.
ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు
కామారెడ్డి టౌన్: లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్) గడువును ఈనెల 3వ తే దీ వరకు పొడిగిస్తూ ప్రభుత్వం గురువారం జీవో విడుదల చేసింది. 25శాతం ఫీజు రా యితీతో గడువును పెంచింది. ఈ అవకాశా న్ని సద్వినియోగం చేసు కోవాలని మున్సిపల్ కమిషనర్ రాజేందర్రెడ్డి కోరారు.

ఎస్సెస్సీ టాపర్లకు సన్మానం

ఎస్సెస్సీ టాపర్లకు సన్మానం

ఎస్సెస్సీ టాపర్లకు సన్మానం