
ఎనిమిది మందికి కారుణ్య నియామకాలు
కాకినాడ సిటీ: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రజాపరిషత్ ఆధ్వర్యంలోని పాఠశాలలు, ఇతర ప్రభుత్వ శాఖల్లో పని చేస్తూ ఆకస్మికంగా చనిపోయిన ఉపాధ్యాయులు, ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాలను జెడ్పీ చైర్మనన్ విప్పర్తి వేణుగోపాలరావు గురువారం నిర్వహించారు. మరణించిన ఉద్యోగుల కుటుంబబ సభ్యులకు కారుణ్య నియామకం కింద ఏడుగురికి జూనియర్ అసిస్టెంట్ పోస్టులను, ఒకరికి ఆఫీసు సబార్డినేట్, చాలాకాలంగా రికార్డు అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న ఇద్దరిలో ఒక డ్రైవరికి జూనియర్ అసిస్టెంట్గా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మనన్ విప్పర్తి మాట్లాడుతూ కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. జెడ్పీ సీఈవో వీవీవీఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ఎనిమిది మందికి కారుణ్య నియామకాలు, ముగ్గురికి పదోన్నతులు కల్పించినట్లు తెలిపారు. జీఎస్ రాంగోపాల్, ఏపీ పంచాయతీరాజ్ మంత్రిత్వ సిబ్బంది సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్వీవీ రమేష్, పరిపాలనాధికారి వీహెచ్ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం, పాల్గొన్నారు.