
ఎంపీపై అధిష్టానానికి ఫిర్యాదు
అలంపూర్: నాగర్కర్నూల్ ఎంపీ మల్లు రవిపై మాజీ ఎమ్మెల్యే, అలంపూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ సంపత్కుమార్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు పలు పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నెల 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీ మల్లు రవి జిల్లాలో పర్యటించారు. ఈక్రమంలో కాంగ్రెస్ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జ్ సరిత ఇంటికి ఎంపీతోపాటు అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు వెళ్లడంపై అలంపూర్ కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా మల్లు రవి బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే అలంపూర్ క్షేత్రానికి ఆయన విచ్చేయగా.. సొంత పార్టీ నేతలు ఈ కార్యక్రమాన్ని బహిష్కరించారు. మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేశారు. ఈ వ్యవహారంపై ఈ నెల 5వ తేదీన రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మీనాక్షి నటరాజ్తోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్గౌడ్ను మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్, స్థానిక కాంగ్రెస్ నాయకులు కలిసి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.