పాలమూరు | - | Sakshi
Sakshi News home page

పాలమూరు

Jun 1 2025 1:01 AM | Updated on Jun 1 2025 1:01 AM

పాలమూ

పాలమూరు

సార్థకనామం..

నేడు ప్రపంచ పాల దినోత్సవం

పాడి రైతులపై ఆర్థిక భారం

కప్పుడు రాష్ట్రానికి రోజువారీగా అవసరమైన పాలు ఒక్క ఉమ్మడి పాలమూరు జిల్లాలోనే ఉత్పత్తి అయ్యేవి అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదేమో. అయితే ప్రస్తుతం పాడి పరిశ్రమ ఒడుదొడుకులను ఎదుర్కొంటుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మూడుసార్లు ఆవు పాల ధర తగ్గించింది. ఇప్పటికే పాడి రైతులు పశుపోషణ భారమై తమ ఆవులు, గేదెలను అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ పరంగా విజయ డెయిరీ ద్వారా ఇస్తున్న దాణా, మినరల్‌ మిక్చర్స్‌, క్యాల్షియం మందులు సబ్సిడీలు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రైతులు ఆర్థిక భారం మోయాల్సి వస్తుంది. కాల్షియం మందులు, విజయ దాణా కొనుగోలు చేయాలంటే సబ్సిడీ కాకుండా పూర్తి ధర చెల్లించాల్సి వస్తుందని పాడి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు పాడి రైతుల సంక్షేమం కోసం డెయిరీ పరంగా అనేక ప్రోత్సాహక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా అవి రైతులకు భరోసా కల్పించడం లేదు. ఉచిత పశువైద్య శిబిరాల నిర్వహణ, పాడి రైతులకు డీబీటీ సదుపాయంతోపాటు ప్రతి 15 రోజులకు ఒకసారి పాల బిల్లులు సక్రమంగా అందడం లేదు. దీంతో రైతులు ప్రైవేటు సెంటర్లలో విక్రయించేందుకు ఆసక్తి చూపుతున్నారు.

పాలమూరు 1
1/2

పాలమూరు

పాలమూరు 2
2/2

పాలమూరు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement