ఉద్యాన పంటల సాగు లాభదాయకం
రైతులు తక్కువ పెట్టుబడి, ప్రభుత్వ సబ్సిడీ పొందుతూ ఉద్యాన పంటలు సాగు చేసుకోవచ్చని ఉద్యాన అధికారి సుస్మిత తెలిపారు.
పెట్టుబడి మాసం.. నెలంతా భారమే..
శుక్రవారం శ్రీ 6 శ్రీ జూన్ శ్రీ 2025
ప్రైవేట్ చదువులకు
ఖర్చులు (అంచనా) ఇలా..
● పూర్వ ప్రాథమిక, ప్రాథమిక స్థాయిల్లో అడ్మిషన్ ఫీజు రూ.5 వేల నుంచి రూ.7వేలు
● స్కూలు, ట్యూషన్ ఫీజు
రూ.15 నుంచి రూ.30వేలు
● పుస్తకాలకు రూ.4వేల నుంచి రూ.8వేలు
● రెండు జతల యూనిఫాం, స్పోర్ట్స్ డ్రెస్లు రూ.3 వేల నుంచి రూ. 5వేలు
● బస్సు రవాణా కోసం
రూ.8 నుంచి రూ.10 వేలు
● హాస్టల్ వసతికి రూ.40 వేల నుంచి
రూ. 70వేలు
బక్రీద్ను ప్రశాంతంగా జరుపుకోవాలి
కాళేశ్వరం: బక్రీద్ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కాటారం డీఎస్పీ రామ్మోన్రెడ్డి తెలిపారు. మండలంలోని మహాదేవపూర్ పోలీస్స్టేషన్లో బక్రీద్ పండుగ సందర్భంగా గురువారం పీస్ కమిటీ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ హింసకు తావు లేకుండా, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ముస్లింలకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై పవన్కుమార్, మహాదేవపూర్ ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.
పర్యావరణాన్ని
ప్రతిఒక్కరూ కాపాడాలి
భూపాలపల్లి అర్బన్: పర్యావరణాన్ని ప్రతిఒక్కరూ కాపాడి భవిష్యత్ తరాలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని జిల్లా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ఆర్ దిలీప్కుమార్నాయక్ తెలిపారు. 53వ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం పర్యావరణ అవగహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ సమతుల్యత దెబ్బతినడంతో ఉష్ణోగ్రతల్లో మార్పులు సంభవిస్తున్నట్లు వివరించారు. పర్యావరణాన్ని పరిరక్షించకపోతే రానున్న రోజుల్లో మానవాళిపై తీవ్రమైన ప్రభావం పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు శ్రవణ్రావు, విష్ణువర్ధన్రావు, శివకుమార్, అక్షయ, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
భూపాలపల్లి రూరల్: బీజేపీతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చందుపట్ల కీర్తిరెడ్డి అన్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నిశిధర్రెడ్డి అధ్యక్షతన 11 సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం–సంకల్పంతో సాకారం అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కీర్తిరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రపంచదేశాలతో పోటీపడుతూ దేశంలో 60 ఏళ్లుగా జరగని అభివృద్ధి మోదీ ప్రభుత్వం చేసి చూపిస్తుందన్నారు. దేశానికి బలమైన నాయకుడు మోదీ తప్పా మరేవరూలేరన్నారు. కేంద్ర ప్రభుత్వం నీతి నిజాయితీలో దేశాన్ని అభివృద్ధి చేస్తుందని, రాష్ట్రాన్ని తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
● వ్యవసాయ పెట్టుబడులకు వ్యయం
● పాఠశాల ప్రవేశాల ఖర్చు
తడిసిమోపెడు
● మధ్యతరగతి కుటుంబాలపై
ఆర్థిక భారం
భూపాలపల్లి అర్బన్: జూన్ మాసం వచ్చిందంటే మధ్యతరగతి కుటుంబాలు, రైతుల్లో ఆందోళన నెలకొంటుంది. పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభంతో విద్యార్థుల తల్లిదండ్రులపై ఫీజుల భారం, రైతులకు పంట సాగులో పెట్టుభారం తప్పడం లేదు. జూన్ మొదటి వారం నుంచి వ్యవసాయానికి పెట్టుబడి కాలం. పిల్లల చదువులకు అన్ని రకాల ఖర్చులు కలిపి తడిసి మోపెడవుతున్నాయి. ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు జూన్ వచ్చిందంటేనే దిక్కులు చూడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. మృగశిర కార్తె నుంచి వ్యవసాయ ఖర్చులు కూడా మొదలవుతున్నాయి. వాతావరణం చల్లబడుతున్న తరుణంలో సామాన్యులకు మాత్రం ఈ మాసం ముచ్చెమటలు పట్టిస్తోంది. మధ్యతరగతి ప్రజలు, వ్యవసాయ ఆధార కుటుంబాలు ఖర్చులకు అవస్థలు పడుతున్నారు.
వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్న
అన్నదాతలు..
జిల్లాలో దాదాపు 1.25 లక్షలకు పైగా రైతులు ఉన్నారు. ఈ వర్షాకాలం సీజన్ల్లో పంటలకు పెట్టుబడి కాలం.. వ్యవసాయ పంట భూములను చదను చేసి, దుక్కిదున్ని, విత్తనాలు, ఎరువులకు పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే వ్యవసాయదారులు దుక్కులు, విత్తనాల కొనుగోలు వంటి పనులు ప్రారంభించారు. కనీసం ఎకరానికి రూ.30 వేల పెట్టుబడి అవసరం కానుంది. ఐదెకరాలున్న రైతు దాదాపు రూ.లక్షకు పైగా డబ్బు వెచ్చించాల్సి ఉంటుంది. ప్రభుత్వం రైతు భరోసా కింద పెట్టుబడి సాయం వస్తున్నా.. అది సరైన సమయానికి చేతికందడం లేదు. పైగా బ్యాంకుల రుణాలు కూడా అవసరమైన సమయానికి అందడం లేదు. దీంతో రైతులు ఒకవైపు బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే మరోవైపు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. అటు పిల్లల చదువులు ఇటు వ్యవసాయ పెట్టుబడికి ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయని రైతులు వాపోతున్నారు.
పిల్లల బడి ఫీజులు భారం..
జిల్లాలో దాదాపు 70కికు పైగా ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయి. గ్రామీణ, మండల స్థాయిలో కొంతమేర తక్కువ ఫీజులు వసూలు చేస్తుండగా.. పట్టణ ప్రాంతాల్లో మాత్రం ఎక్కువ మొత్తంలో ఫీజులు ఉన్నాయి. ప్రీ ప్రైమరీ తరగతులకు రూ.20 వేలకు పైగా, ప్రైమరీకి రూ.40వేలు, హైస్కూల్కు రూ.50 వేల వరకు ఫీజులు ఉన్నాయి. ఏటా 10 నుంచి 20 శాతం మేర ఫీజులు పెరుగుతుండడంతో తల్లిదండ్రులపై భారం పడుతోంది. దీనికి తోడు పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్కులు, యూనిఫాం, బ్యా గులు, స్టడీ మెటీరియల్ ఇతర ఖర్చులతో తల్లిదండ్రులపై భారం పెరుగుతోంది. జిల్లా కేంద్రానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి తన కుమార్తె 9వ తరగతి చదువుతుండగా.. నోట్ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు యూనిఫాం, బడి ఫీజు, అడ్మిషన్ ఫీజు వంటివి కలుపుకొని రూ.లక్ష వరకు అవుతుందని చెప్తున్నారు. కాగా ఇంత మొత్తం ఖర్చును భరించలేక ప్రభుత్వ విద్యాసంస్థలో అడ్మిషన్ తీసుకున్నాడు. ఇలా ఫీజుల భారం మధ్యతరగతి కుటుంబాలపై ఎక్కువగా పడుతోంది.
వాల్పోస్టర్లను ఆవిష్కరిస్తున్న కలెక్టర్, అధికారులు
న్యూస్రీల్
ఖర్చు పెరుగుతోంది..
జిల్లా కేంద్రంలోని సింగరేణి కార్మిక సంఘం కార్యాలయంలో వర్కర్గా పని చేస్తున్న. పని చేస్తూనే మా ఇద్దరు పిల్లల్ని చదివిస్తున్న. చదువులకు తప్పనిసరి పరిస్థితుల్లో అధిక మొత్తం వరకు వెచ్చించాల్సి వస్తోంది. దీనికి తోడు రోజువారీ ఖర్చులు, నిత్యావసరాలు, ఇంటి అద్దె పోను రూపాయి కూడా మిగలడం లేదు. మళ్లీ కొత్త అప్పులు చేయాల్సి వస్తోంది.
– ఎనుగుల భిక్షపతి, భూపాలపల్లి
రెండువైపులా భారం..
జూన్ వచ్చిందంటే చాలు రెండువైపులా పెట్టుబడి పెట్టాల్సి వస్తోంది. ఒకవైపు పిల్లల చదువులపై, మరోవైపు పంట పెట్టుబడులు. ఇలా రెండు వైపులా ఒకేసారి ఒకే నెలలో ఖర్చు పెట్టాల్సి రావడంతో భారం పడుతోంది. ఏటా వేసవి సెలవులు పూర్తవుతున్నాయంటేనే తీవ్ర మానసిక ఒత్తిడి కలుగుతోంది. ప్రభుత్వం నుంచి రైతు భరోసా డబ్బులు త్వరగా ఇవ్వాలి. ఈ డబ్బులతో కొంత ఉపశమనం కలిగే అవకాశం ఉంటుంది.
– పోలవేని రాజేందర్, వేశాలపల్లి
అమ్మో జూన్!
అమ్మో జూన్!
అమ్మో జూన్!
అమ్మో జూన్!
అమ్మో జూన్!