
‘ఇందిరమ్మ’తో సొంతింటి కల సాకారం
కథలాపూర్: సొంతింటి కల నెరవేర్చాలని అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కథలాపూర్లో ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం 306 మందికి ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలు అందించారు. 56మందికి రూ.21.21 లక్షల సీఎమ్మార్ఎఫ్ చెక్కులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడత పైలట్ ప్రాజెక్టు కింద పోసానిపేట గ్రామంలో 117మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తుందన్నారు. నాలుగు దశలుగా బిల్లులు చెల్లిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు జివాకర్రెడ్డి, శ్రీనివాస్, జిల్లా గృహానిర్మాణశాఖ అధికారి మారుతి, ఎంపీడీవో శంకర్, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, వైస్ చైర్పర్సన్ పులి శిరీష, కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షుడు కాయితి నాగరాజు పాల్గొన్నారు.
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్