అరటిసాగు పెంచేలా చూడాలి | - | Sakshi
Sakshi News home page

అరటిసాగు పెంచేలా చూడాలి

Jun 5 2025 8:22 AM | Updated on Jun 5 2025 8:22 AM

అరటిసాగు పెంచేలా చూడాలి

అరటిసాగు పెంచేలా చూడాలి

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

జగిత్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో అరటిసాగును పెంచాలని, ప్రభుత్వం ద్వారా రైతులకు సాయం అందేలా చూస్తామని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ పేర్కొన్నారు. ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో బుధవారం రైతులు, వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. అరటిసాగును పెంచితే రైతులకు ప్రోత్సాహం అందిస్తామన్నారు. ట్రేడర్స్‌ మాట్లాడుతూ.. అరటిని కొనడానికి సిద్ధంగా ఉన్నామని, రైతులు నాణ్యమైన ఉత్పత్తులు అందిస్తే ఎన్ని టన్నులైనా కొంటామని తెలి పారు. మహారాష్ట్రంలోని జల్గమ్‌ గ్రామంలో నాణ్యౖ మెన అరటిని పండిస్తున్నారని, విదేశాలకు ఎగుమతి అవుతుందన్నారు. జిల్లా ఉద్యానవన అధికారి శ్యామ్‌ప్రసాద్‌ మాట్లాడుతూ అరటి పండించేందుకు రైతులను గుర్తిస్తామని, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఉద్యానవనశాఖ ద్వారా ఎకరానికి రూ.16,800 సబ్సిడీ అందజేస్తామన్నారు.

భూ సమస్యలు లేని రాష్ట్రమే లక్ష్యం

వెల్గటూర్‌: భూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే భూ భారతి చట్టం లక్ష్యమని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. బుధవారం వెల్గటూర్‌, ఎండపల్లి మండలంలోని మొక్కట్రావుపేట, గొడిశెలపేట గ్రామాల్లో నిర్వహించిన రెవెన్యూ సదస్సులను పరిశీలించారు. రెవెన్యూ సదస్సుల్లో భూ సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు ఆర్డీవో మధుసూదన్‌, వెల్గటూర్‌, ఎండపల్లి తహసీల్దార్‌లు శేఖర్‌, అనిల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement