బుల్లెట్ రైలెక్కిన ప్రధాని మోదీ.. శిక్షణ పొందుతున్న భారత డ్రైవర్లతో భేటీ | PM Modi In Japan Takes Bullet Train Ride, Photos Goes Viral | Sakshi
Sakshi News home page

బుల్లెట్ రైలెక్కిన ప్రధాని మోదీ.. శిక్షణ పొందుతున్న భారత డ్రైవర్లతో భేటీ

Aug 30 2025 9:36 AM | Updated on Aug 30 2025 10:43 AM

PM Modi in Japan Takes Bullet Train Ride

టోక్యో: ప్రధాని నరేంద్ర మోదీ తన జపాన్ పర్యటనలో రెండవ రోజు జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో పాటు బుల్లెట్ రైలులో ప్రయాణించారు. తూర్పు జపాన్ రైల్వే కంపెనీలో ప్రస్తుతం శిక్షణ పొందుతున్న భారత రైలు డ్రైవర్లతో సంభాషించారు. ఈ రైలులో ప్రయాణించేందుకు ఇద్దరు ప్రధానులు ముందుగా సెండాయ్ నగరానికి చేరుకున్నారు.
 

జపాన్ ప్రధాని తన ‘ఎక్స్‌’ఖాతాలో బుల్లెట్‌ ప్రయాణానికి సంబంధించిన ఫొటోలను షేర్‌ చేశారు. ప్రస్తుతం జపాన్‌లో పలువురు భారత రైలు డ్రైవర్లు బుల్లెట్‌ రైలు నడపడంలో శిక్షణ పొందుతున్నారు. ప్రధాని మోదీ తన బుల్లెట్ రైలు ప్రయాణానికి ముందు  ఆ డ్రైవర్లను కలిశారు. వారితో ఫోటోలు దిగారు. దీనికి ముందు ప్రధాని మోదీ టోక్యోలో  పదహారు ప్రిఫెక్చర్‌ల గవర్నర్‌లతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. 15వ వార్షిక ఇండియా-జపాన్ శిఖరాగ్ర సమావేశంలో  ఇరుదేశాల సహకారంపై చర్చ జరిగిందని, వాణిజ్యం, ఆవిష్కరణలు, వ్యవస్థాపకత తదితర రంగాలలో పరస్పర సహకారానికి అపారమైన అవకాశాలున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement