
కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలి
వరంగల్ చౌరస్తా: నగరంలో షాపింగ్ మాల్స్ గుమాస్తాలు, కార్మికులకు నెలకు రూ.26 వేల వేతనం ఇవ్వాలని సీఐటీయూ వరంగల్ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు వరంగల్లో వ్యాపారవేత్త కాసం షాపింగ్ మాల్స్ యజమాని ఓం నమశ్శివాయకు ఆదివారం సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నందున ఈనెల 20న జరగనున్న సమ్మెలో కార్మికులు పాల్గొనాలని కోరారు. కార్మికులకు ప్రభుత్వాలు ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్, ఎనిమిది గంటల పని దినాలు అమలు చేయాలని, పని భద్రత కల్పించాలని, మహిళా కార్మికులకు కనీస వసతులు, వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బావు రామస్వామి జి.జగదీశ్వర్, జి.రాజు, బాబురావు, కృష్ణమూర్తి, మెరుగు రాజశేఖర్, శ్రీరాములు పాల్గొన్నారు.