ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి

May 4 2025 8:14 AM | Updated on May 4 2025 8:14 AM

ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి

ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలి

న్యూశాయంపేట: ప్రజా పోరాటాలకు సీపీఐ శ్రేణులు సిద్ధం కావాలని పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాస్‌రావు పిలుపునిచ్చారు. హనుమకొండ బాలసముద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా కౌన్సిల్‌ సమావేశాన్ని కొట్టెపాక రవి అధ్యక్షతన శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ఈ నెల 26, 27వ తేదీల్లో హసన్‌పర్తిలో జరుగనున్న జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని హనుమకొండ జిల్లా కార్యదర్శి కర్రె భిక్షపతి కోరారు. సమావేశంలో నాయకులు శ్రీనివాస్‌, సదాలక్ష్మి, టి.భిక్షపతి, ఎల్లేశ్‌, లింగారెడ్డి, లక్ష్మణ్‌, రాములు, సంతోష్‌, రాజు, శంకర్‌, రాజమౌళి, సదానందం, వెంకట్రాజం, సారంగపాణి, శ్యాంసుందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement