వివాహేతర సంబంధంతోనే మహిళ హత్య | - | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధంతోనే మహిళ హత్య

Jun 7 2025 1:47 AM | Updated on Jun 7 2025 1:47 AM

వివాహేతర సంబంధంతోనే మహిళ హత్య

వివాహేతర సంబంధంతోనే మహిళ హత్య

వేటపాలెం: వివాహేతర సంబంధం నేపథ్యంలోనే మానికల దీపిక అలియాస్‌ వేటగిరి ప్రమీల (24) ను అదే కాలనీకి చెందిన ఇద్దరు హత్య చేసినట్లు చీరాల డీఎస్పీ మొయిన్‌ తెలిపారు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో మహిళ హత్యకు సంబంధించిన వివరాలను డీఎస్పీ శుక్రవారం వివరించారు. ఈ నెల 2వ తేదీన రామన్నపేట పంచాయతీ పరిధిలోని నాగవరపమ్మ దేవస్థానం వద్ద గుర్తు తెలియని మహిళ మృత దేహం గుర్తించారు. అయితే రామన్నపేట పంచాయతీ వినాయకపురానికి చెందిన మానికల దీపిక అలియాస్‌ వేటగిరి ప్రమీల నెల రోజుల క్రితం అదృశ్యం అయినట్లు ఆమె అత్త పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో అదే కాలనీకి చెందిన ఈగ వెంకటేశ్వరరావు, సైకం నాగబాబు.. గద్దల గుంటకి చెందిన ఇద్దరు బావ బావమర్దులు. వీరిద్దరే చంపి ఉంటారని కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. వీరిద్దరిని శుక్రవారం అదుపులోకి తీసుకొని విచారించారు. కాగా గుర్తు తెలియని మహిళ విషయం తమకు తెలియదని, తాము దీపికను చంపి గ్రామ శివారులోని తోటలో పూడ్చి పెట్టినట్లు ఒప్పుకున్నారు. మృతురాలి భర్త చనిపోవడంతో వ్యసనాలకు బానిసైన ఆమె అత్త వద్ద ఉంటోంది. ఈ క్రమంలో ఆమె ఇంటి వద్దనే ఉంటున్న ఈగ వెంటేశ్వరరావుతో వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొంత కాలానికి వెంకటేశ్వరరావు కొమరిగిరి రాములమ్మని వివాహం చేసుకున్నాడు. అనంతరం అదే కాలనీకి చెందిన సైకం నాగబాబుతో వివాహేతర సంబంధం పెట్టుకుని, వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేసింది. లేదంటే విషయం అందరికీ చెబుతానని బెదిరించడం మొదలు పెట్టింది. దీంతో ఈగ వెంకటేశ్వరరావు, సైకం నాగబాబులు ఆమెను చంపాలని నిర్ణయించుకున్నారు. ఏప్రిల్‌ 30వ తేదీన దీపికను బైక్‌ పై ఎక్కించుకొని పందిళ్లపల్లి– తిమ్మసముద్రం రోడ్‌ వరకు వెళ్లారు. అక్కడ ఆమెతో బీరు తాగించారు. అనంతరం బీరు సీసాతో తలపై కొట్టి.. అపస్మారక స్థితిలోకి వెళ్లగా.. మెడకు చున్నీ చుట్టి చంపివేశారు. శవాన్ని మూట కట్టి బైక్‌పై పెట్టుకొని రామన్నపేట శివారు తోటల్లోకి తీసుకొచ్చి పూడ్చి వేసినట్లు నిందితులు అంగీకరించారు. పూడ్చిపెట్టిన శవాన్ని తహసీల్దార్‌ సమక్షంలో తవ్వి బయటకు తీసి పోస్టుమార్టం చేయించారు. మోటార్‌ బైక్‌, దుస్తులు, మృతురాలి సెల్‌ఫోన్‌ స్వాధీనం చేసుకున్నారు. కేసును త్వరగా ఛేదించిన చీరాల రూరల్‌ సీఐ శేషగిరిరావు, ఎస్సై మీసాల వెంకటేశ్వర్లు, ఎస్‌బీ హెచ్‌సీ అచ్చయ్య, తన్నీరు శ్రీను, పి.నరసింహారావు, ఎస్‌కే బాజీత్‌, పీసీ బాలచంద్రలను డీఎస్పీ అభినందించారు.

నిందితులు అరెస్ట్‌

వివరాలు వెల్లడించిన డీఎస్పీ మొయిన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement