ఈఏపీసెట్‌లో మెరిసిన మనోళ్లు | - | Sakshi
Sakshi News home page

ఈఏపీసెట్‌లో మెరిసిన మనోళ్లు

Jun 9 2025 7:03 AM | Updated on Jun 9 2025 7:05 AM

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏపీఈఏపీ సెట్‌ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తాచాటారు. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు 3,409 మంది, అగ్రికల్చరల్‌ కోర్సుల్లో ప్రవేశాలకు 1,726 మంది అర్హత సాధించారు. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో పాకలపాటి హర్షవర్ధన్‌ 85, ఏలూరుకి చెందిన అల్లు హేమంత్‌ 97, అగ్రికల్చరల్‌ కోర్సుల్లో పెదపాడు మండలం కొక్కిరపాడుకు చెందిన కోసూరి వల్లీ ప్రియ 59, ఏలూరుకు చెందిన యర్రా శోభ రిషిత 109వ ర్యాంకులతో ప్రతిభ కనబర్చారు. ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షలకు జిల్లా నుంచి 4,874 మంది దరఖాస్తు చేసుకోగా 4,700 మంది పరీక్షలు రాశారు. వారిలో 1,817 మంది బాలురు, 1,592 మంది బాలికలు అర్హత సాధించారు. అగ్రికల్చరల్‌ పరీక్షలకు 2,002 మంది దరఖాస్తులు చేసుకోగా 1,899 మంది పరీక్షలు రాశారు. వారిలో 443 మంది బాలురు, 1283 మంది బాలికలు అర్హత సాధించారు.

అగ్రికల్చరల్‌లో..

పెదపాడు మండలం కొక్కిరపాడుకు చెందిన కోసూరి వల్లీప్రియ (59వ ర్యాంకు), ఏలూరుకి చెందిన యర్రా శోభ రిషిత (109), పోలవరానికి చెందిన కొట్టే వెంకట శ్రీ కార్తీక్‌ (283), కొయ్యలగూడెం మండలం రాజవరానికి చెందిన తిరుమలనాథుని సత్య సృజన్‌ (313), లింగపాలెం మండలం కొణిజర్లకు చెందిన లక్కపాము కమలాకర్‌ (318), నూజివీడుకు చెందిన కుప్పాల దేదీప్య సాయి (358), టి.నరసాపురం మండలం సాయంపాలెంకు చెందిన మారిశెట్టి భాగ్యశ్రీ (375), కలిదిండి మండలం పోతుమర్రుకు చెందిన వల్లభుని దినేష్‌ సాయి (378), ఏలూరుకు చెందిన భీమవరపు హరి ప్రియ రామన్‌ (447), పెదవేగి మండలం భోగాపురానికి చెందిన యామిని దిమ్మిటి (448) మొదటి పది స్థానాల్లో నిలిచారు.

ఇంజనీరింగ్‌లో 3,409 మంది..

అగ్రికల్చరల్‌లో 1,726 మంది అర్హత

ఇంజనీరింగ్‌లో తొలి 10 స్థానాల్లో..

ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురానికి చెందిన పాకలపాటి హర్షవర్ధన్‌ (85వ ర్యాంకు), ఏలూరుకి చెందిన అల్లు హేమంత్‌ (97), కొయ్యలగూడెం మండలం పరింపూడికి చెందిన బండ్లపల్లి యోగ సాయి శ్రీనివాస్‌ (162), కామవరపుకోటకు చెందిన ద్వాదశి మోహన (313), నూనె రమేష్‌ (358), ముత్తంశెట్టి వెంకట్‌ హనీష్‌ (378), టి.నరసాపురం మండలం బందంచర్లకు చెందిన అనుమోలు తరుణ్‌ సాయి (401), లింగపాలెం మండలం యడవల్లికి చెందిన గోల్కొండ జగదీప్‌ శరణ్‌ (409), పోలవరానికి చెందిన పడాల జశ్వంత్‌సాయి చరణ్‌ (421), చింతలపూడి మండలం రాఘవాపురానికి చెందిన సిరి సంజన మారుమూడి (438) మొదటి పది స్థానాల్లో నిలిచారు.

ఈఏపీసెట్‌లో మెరిసిన మనోళ్లు 1
1/2

ఈఏపీసెట్‌లో మెరిసిన మనోళ్లు

ఈఏపీసెట్‌లో మెరిసిన మనోళ్లు 2
2/2

ఈఏపీసెట్‌లో మెరిసిన మనోళ్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement