
హాకీ పోటీల విజేతగా అనంతపురం
భీమవరం: క్రీడలతో శారీరక దారుఢ్యంతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంపొందించుకోవచ్చని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ అన్నారు. భీమవరం డీఎన్నార్ కళాశాల ఆవరణలో మూడు రోజులపాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి అంతర్ జిల్లా బాలికల హాకీ పోటీల ముగింపు సందర్భంగా ఆదివారం విజేతలకు బహుమతులు అందజేశారు. పోటీల్లో 16 జట్లు పాల్గొనగా ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో అనంతపురం, అన్నమయ్య జిల్లాల జట్లు తలపడగా అనంతపురం విజయం సాధించింది. కార్యక్రమంలో భీమవరం మండల పరిషత్ అధ్యక్షుడు పేరిచర్ల విజయ నరసింహరాజు, హాకీ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి గంధం హర్షవర్థన్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కలిదిండి ఆనందరాజు, కేవీస్ భరత్ తదితరులు పాల్గొన్నారు.