
సూపర్ సిక్స్.. మోసం ఫిక్స్
హోరాహోరీగా హాకీ పోటీలు
భీమవరంలో 15వ అంతర్ జిల్లాల రాష్ట్రస్థాయి బాలికల హాకీ పోటీలు రసవత్తరంగా సాగుతున్నాయి. పలు జిల్లాల నుంచి 16 జట్లు పాల్గొంటున్నాయి. 10లో u
కూటమి నాయకులు సూపర్ సిక్స్ పథకాలంటూ ఊదరగొట్టారు.. 143 హామీలతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కలిపి సంయుక్తంగా కూటమి మేనిఫెస్టో ప్రకటించి ఇంటింటికీ కరపత్రాలు పంచారు.. తీరా చూస్తే గద్దెనెక్కి ఏడాది గడుస్తున్నా ఒక్క పథకాన్నీ మొదలు పెట్టకుండా ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నవరత్నాల పేరులో జిల్లాలో పలు పథకాల కింద ఏటా సగటున రూ.1,850 కోట్ల నగదు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమకాగా.. కూటమి ప్రభుత్వంలో చిల్లిగవ్వ కూడా జమకాని పరిస్థితి. సూపర్సిక్స్ హామీలు అమలు కాకపోవడంతో జిల్లాలో ప్రజలు సుమారు రూ.2,100 కోట్లకుపైగా నష్టపోయారు.
ఆదివారం శ్రీ 8 శ్రీ జూన్ శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, ఏలూరు: వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత 2019లో తొలి సమావేశం నుంచి మేనిఫెస్టో అమలుకు ప్రాధా న్యమిచ్చారు. తొలి ఏడాదిలోనే 90 శాతం హామీలను అమలుచేసి చూపించారు. మేనిఫెస్టోలోని హామీలతో పాటు, మేనిఫెస్టోలో లేని పలు పథకాలను అమలు చేసి విశ్వసనీయత చాటారు. సంక్షేమ క్యాలెండర్ రూపొందించి అమలుకు పక్కాగా చర్య లు తీసుకున్నారు. ఇదంతా వైఎస్ జగన్ హయాంలో నడిచిన సంక్షేమ అజెండా తీరు.
హామీలు గుప్పించి.. చివరకు విస్మరించి..
గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నేతలు సూపర్ సిక్స్తో పాటు రాష్ట్రస్థాయిలో 143 హామీలు, అలాగే ఉమ్మడి పశ్చిమలో మరో 20 హామీలు గుప్పించి విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది గడిచినా ఒక్క పథకం కూడా అమలు చేయలేదు. ఉచిత బస్సు ఎప్పుడనే డిమాండ్ బలంగా వినిపిస్తున్నా.. అదిగో ఇదిగో అంటూ ప్రభుత్వం కాలయాపన చేస్తోది. ఇక అన్నదాత సుఖీభవ పేరుతో రూ.20 వేలు జమ చేయకుండానే ఖరీఫ్, రబీ సీజన్లు ముగించేశారు. అలాగే మొదటి సంవత్సరం తల్లికి వందనం అమలు చేయకుండా గడిపేశారు. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి పథకాల అమలును విజయవంతం అటకెక్కించారు. సూపర్సిక్స్ హామీలను వెంటనే అమలుచేయాలంటూ ప్రజలు రోడ్లెక్కి నినదిస్తున్నా పట్టించుకోవడం లేదు.
భృతి.. భ్రాంతి :
జిల్లాలో ప్రతి ఇంటికో ఉద్యోగం.. లేదంటే రూ.3 వేల నిరుద్యోగ భృతి అన్నారు. జిల్లాలో గ్రామీణ ప్రాంతంలో 4,50,118, పట్టణ ప్రాంతాల్లో 96,672 మొత్తంగా 5,47,790 నివాసాలు ఉన్నాయి. నెలకు రూ.3 వేల చొప్పున సుమారుగా నెలకు రూ.164 కోట్లు చొప్పున ఏడాదికి రూ.1,968 కోట్లు నిరుద్యోగులకు సర్కారు బకాయి పడింది.
మహిళలకు టోకరా
జిల్లాలో 18 ఏళ్లు పైబడిన మహిళలు 8,29,659 ఉండగా వారందరికీ ఉచిత బస్సు సౌకర్యం అందడం లేదు. అలాగే ప్రతి మహిళకు ఆడబిడ్డ నిధి పేరుతో రూ.1,500 జమ చేస్తామన్నారు. జిల్లా 19–59 ఏళ్ల వయసున్న మహిళలు 6,71,033 మంది ఉండగా వీరందరికీ నెలకు రూ. 100.56 కోట్ల చొప్పున ఏడాదికి రూ.1,207.80 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం మోసం చేసింది. అందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్లు అని చెప్పి కొద్ది మందికే పరిమితం చేశారు. అది కూడా ఏడాది పాలనలో ఒక్క సిలిండర్తోనే సరిపెట్టారు. జిల్లాలో 5,81,314 కనెక్షన్లకు సిలిండర్లు ఇవ్వాల్సి ఉన్నా కనీసం ఒక్క ఉచిత సిలిండర్ను నూరు శాతం పంపిణీ చేయకపోవడం గమనార్హం.
అన్నదాతకు మొండిచేయి
జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 1,98,179 మంది రైతులకు ఏటా రూ.20 వేల చొప్పున రూ.336 కోట్లు జమ చేయాలి. మొదటి ఏడాది మోసం చేశారు. గత ప్రభుత్వంలో జగన్ హయాంలో 1,98,179 మంది రైతులకు ఏటా రూ.236.99 కోట్ల చొప్పున క్రమం తప్పకుండా నాలుగేళ్లు జమ చేశారు.
న్యూస్రీల్
కూటమి మాయా మేనిఫెస్టో
ఏడాది గడిచినా ఒక్క పథకమూ అమలు కాలేదు
జిల్లాలో కనిపించని అభివృద్ధి, సంక్షేమం
ఉచిత బస్సు నుంచి తల్లికి వందనం వరకూ అన్నీ పెండింగే..
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోపవిత్ర గ్రంథంలా మేనిఫెస్టో
జిల్లాలో ఏటా రూ.1,850 కోట్లకుపైగా సంక్షేమ పథకాల అమలు
కూటమి పాలనపై జనాగ్రహం
తల్లికి ఎగనామం
జిల్లాలో తల్లికి వందనం పేరుతో తల్లులకు రూ. 486.96 కోట్లు ప్రభుత్వం బకాయి పడింది. స్కూల్కు వెళ్లే పిల్లలకు ఎంత మంది ఉంటే అంతమందికి రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు. జిల్లాలో 1,818 ప్రభుత్వ, 495 ప్రైవేటు పాఠశాలల్లో కలిపి 2,91,858 మంది విద్యార్థులు ఉన్నారు. అలాగే 127 ప్రభుత్వ, జూనియర్ కళాశాలల్లో 31,448 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికి రూ.486.96 కోట్లు జమ కావాల్సి ఉంది. అదే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జిల్లాలో 1,78,214 మంది విద్యార్థులకు రూ.267.32 కోట్లు చొప్పున ఏటా అమ్మఒడి పేరుతో తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేసింది.

సూపర్ సిక్స్.. మోసం ఫిక్స్

సూపర్ సిక్స్.. మోసం ఫిక్స్