మాయమాటలతో ఏటీఎంలో సొమ్ము స్వాహా | - | Sakshi
Sakshi News home page

మాయమాటలతో ఏటీఎంలో సొమ్ము స్వాహా

Jun 7 2025 12:59 AM | Updated on Jun 7 2025 12:59 AM

మాయమాటలతో ఏటీఎంలో సొమ్ము స్వాహా

మాయమాటలతో ఏటీఎంలో సొమ్ము స్వాహా

ఆకివీడు: సొమ్ము డ్రా చేద్దామని ఏటీఎంకు వెళ్లిన ఇద్దరికి టోకరా వేసి రూ.39,500 డ్రా చేసిన సంఘటన శుక్రవారం జరిగింది. అయిభీమవరం టర్నింగ్‌ వద్ద ఏటీఎంలో డబ్బు డ్రా చేసేందుకు ఉపాధ్యాయురాలు సూర్యకుమారి, ఆమె భర్త సత్యనారాయణమూర్తి వెళ్లారు. ఏటీఎంలో కార్డు పెట్టి కోడ్‌ కొట్టినా సొమ్ము రాకపోవడంతో.. అక్కడే ఉన్న మరో వ్యక్తి వచ్చి ఇప్పుడే డ్రా చేశాను కార్డు ఇవ్వండి ట్రైచేస్తానని చెప్పాడు. కార్డు లోపల పెట్టగా సొమ్ము రాకపోవడంతో.. అతని వద్ద ఉన్న వేరే కార్డు వాళ్లకు ఇచ్చి ఆ వ్యక్తి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఎస్‌బీఐ మెయిన్‌బ్రాంచ్‌ వద్ద ఉన్న ఏటీఎంకు వెళ్లి సూర్యకుమారి కార్డుతో ఆ వ్యక్తి రూ.39,500 డ్రా చేసి పరారయ్యాడు. డబ్బులు డ్రా చేయడం సెల్‌ఫోన్‌లో మెసేజ్‌ రాగా.. వెంటనే మెయిన్‌ బ్రాంచ్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వెంటనే కార్డు బ్లాక్‌ చేశారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదుచేయగా.. ఎస్సై హనుమంతు బాధితులతో మాట్లాడారు. సీసీ పుటేజ్‌లు పరిశీలించి కేసు నమోదు చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement