
వ్యాన్ను ఢీకొన్న కంటైనర్
జాతీయ రహదారిపై దెందులూరు హెచ్పీ పెట్రోలు బంకు వద్ద మంగళవారం వ్యాన్ను కంటైనర్ లారీ ఢీకొనడంతో ఆరుగురికి గాయాలయ్యాయి. 8లో u
బకాయిలు
తక్షణం చెల్లించాలి
ఏలూరు (టూటౌన్):శ్రీ సత్య సాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ నిర్వహణ కార్మికుల యూనియన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద బకాయి జీతాలను చెల్లించాలని కోరుతూ మంగళవారం ధర్నా నిర్వహించారు. యూనియన్ గౌరవాధ్యక్షుడు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ కార్మికుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. 9 నెలల నుంచి జీతాలు లేవని, తక్కువ జీతాలు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పథకానికి కలెక్టర్ చైర్మన్గా ఉన్నా కార్మికులకు జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ యువగళం పాదయాత్రలో ఈ పథకాన్ని దత్తత తీసుకుంటామని ఇచ్చిన హామీని మరిచిపోయారని ఎద్దేవా చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ఐటీడీఏ సందర్శనకు వచ్చినప్పుడు కార్మికులు వెళ్లి వినతిపత్రం ఇచ్చి సమస్యను చెప్పుకున్నారు, తక్షణం స్పందించి కార్మికులకు జీతాలు చెల్లించాలని ఆదేశించినా ఇంతవరకూ ఇవ్వలేదన్నారు. యూనియన్ అధ్యక్షుడు జి. శివ సత్యనారాయణ, కార్యదర్శి ఎ.సత్యనారాయణ, సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు.