ధాన్యం రైతుల గగ్గోలు | - | Sakshi
Sakshi News home page

ధాన్యం రైతుల గగ్గోలు

May 2 2025 1:06 AM | Updated on May 2 2025 1:06 AM

ధాన్య

ధాన్యం రైతుల గగ్గోలు

ధాన్యం కొనడం లేదని ఆందోళన రైతు సేవా కేంద్రాల వద్ద నిరసనలు

దెందులూరు: దెందులూరు నియోజకవర్గంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలపై ఉన్నతాధికారుల పర్యవేక్షణా లోపం, ప్రభుత్వ నిర్వాకంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ధాన్యం టార్గెట్‌లు అయిపోయాయని, మేం కొనుగోలు చేయలేమంటూ ధాన్యం కేంద్రాల సిబ్బంది చెప్పడంతో ఆందోళన చెందుతున్నారు. నియోజకవర్గంలో 16 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయగా కొవ్వలి, దెందులూరుతో పాటు పలు గ్రామాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం రాత్రి కొవ్వలి, దెందులూరు కేంద్రాల వద్ద రైతులు ధాన్యం ట్రాక్టర్లతో నిరసనలు తెలిపారు. నియోజకవర్గంలో ప్రభుత్వ ధాన్యం సేకరణ అధ్వానంగా ఉండటంతో గత్యంతరం లేక పంటను అయినకాడికి అమ్ముకుంటున్నామని అన్నా రు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రతి గింజా కొంటాం.. సరిపడా గోనె సంచులు ఇస్తాం.. స కాలంలో సొమ్ములు ఖాతాల్లో జమచేస్తామని పాల కులు చెప్పిన మాటలు ఇక్కడ మాత్రం అమలు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దెందులూరులో జరిగిన నిరసనలో గాసే రామారావు, నిట్టా సురేష్‌, వెంకటేష్‌, శ్రీను, మల్లయ్య, వీర్రాజుతో పాటు మరికొందరు రైతులు ఉన్నారు.

ఆన్‌లైన్‌ చేయట్లేదు

ధాన్యం కేంద్రంలో టార్గెట్‌ అయిపోయిందని చెప్పి ఆన్‌లైన్‌ చేయట్లేదు. అలాగని రైస్‌ మిల్లులు వద్దకు వెళితే కొనమని మిల్లర్లు చెబుతున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధాన్యాన్ని రోడ్లపై ఉంచాం. సంచులు లేక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనక, మిల్లర్లు కూడా కొనమంటే మా పరిస్థితి ఏంటి. అలాగే పాలగూడెం, దెందులూరు కేంద్రాల్లో ధాన్యం బస్తాకు 600 గ్రాములు తీస్తుంటే.. కొవ్వలిలో మాత్రం రెండు కిలోలు తీస్తున్నారు. అధికారులు ఈ విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాలి.

–నాగరాజు, రైతు, కొవ్వలి

ధాన్యం రైతుల గగ్గోలు 1
1/2

ధాన్యం రైతుల గగ్గోలు

ధాన్యం రైతుల గగ్గోలు 2
2/2

ధాన్యం రైతుల గగ్గోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement