
రోప్ స్కిప్పింగ్లో ‘నన్నయ’కు ఓవరాల్ చాంపియన్షిప్
రాజానగరం: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ రోప్ స్కిప్పింగ్ పురుషుల విభాగంలో ఆదికవి నన్నయ యూనివర్సిటీ క్రీడాకారులు ఓవరాల్ చాంపియన్షిప్ కై వసం చేసుకున్నారు. మహిళల విభాగంలో తృతీయ స్థానంలో నిలిచారని వీసీ ఆచార్య ఎస్.ప్రసన్నశ్రీ తెలిపారు. ఈ నెల 22 నుంచి మూడు రోజుల పాటు రాజస్తాన్లోని పింద్వారా మాధవ్ యూనివర్సిటీలో జరిగిన ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి తమ క్రీడాకారులు ఈ ఘనతను సాధించారన్నారు. పురుషుల విభాగంలో ఐదు, మహిళల విభాగంలో నాలుగు పతకాలు అందుకున్నారన్నారు. ఆర్.ఏసుకు గోల్డ్, సిల్వర్ మెడళ్లు, కె.వేణుసాయి రెండు సిల్వర్, ఎం.లీలాగణేష్ ఒక సిల్వర్ మెడల్ను, జె.గాయత్రీ, ఎం.నాగాదేవి, సీహెచ్ సాయిలలిత, ఎస్ఆర్. గంగాభవాని ఒక్కొక్క గోల్డ్ మెడల్ను సొంతం చేసుకున్నారని వివరించారు. ఈ సందర్భంగా ఆమెతో పాటు, రిజిస్ట్రార్ ఆచార్య జి.సుధాకర్, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు విజేతలను అభినందించారు.