
కోతుల దాడిలో గాయాలు.. వైద్యానికి రూ.4 లక్షలు
గత ఏప్రిల్ 4న రామవరానికి చెందిన ట్యాక్సీ డ్రైవర్ అబ్దుల్ సలీం ఇంట్లో కోతుల నానారభస సృష్టించాయి. కుటుంబ సభ్యులపై దాడిచేశాయి. ఇంటి యజమాని కర్ర పట్టుకుని కో తులను బెదరగొట్టే ప్రయత్నం చేయగా, మూకుమ్మడిగా తిరగబడ్డాయి. దీంతో భయపడి ఇంట్లోకి పరుగెత్తుతుండగా గడప తాకి కిందపడ్డాడు. తలకు దెబ్బతగిలి తీవ్ర గాయాలు కావడంతో స్థానికంగా, ఖమ్మంలో చికిత్స పొందాడు. తలకు ఆపరేషన్ చేసి 53 కుట్లు వేశారు. ఇందుకోసం రూ. 4లక్షల వరకు ఖర్చయిందని కుటుంబీకులు తెలిపారు. కొద్దిరోజుల తర్వాత మరో ఆపరేషన్ చేయాలని, ఇందుకోసం ఇంకా రూ. లక్షలు ఖర్చవుతుందని వైద్యులు పేర్కొన్నట్లు బాధితుడు చెప్పాడు. కారు నడుపుతూ జీవనం సాగించే సలీం రెండు నెలలుగా ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నాడు. కారు నడిపే వీలులేకపోవడంతో కుటుంబం అప్పులపాలవుతోంది.