
ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం పెంచాలి
దమ్మపేట : ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగేలా చొరవ తీసుకోవాలని, ఈ మేరకు రైతులను ప్రోత్సహించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ అధికారులకు సూచించారు. మండలంలోని గండుగులపల్లిలో మంత్రిని అధికారులు కలిశారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ.. పామాయిల్ సాగులో ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఆదర్శంగా తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఈ పంట సాగుపై దృష్టి పెట్టేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. తెలంగాణను పామాయిల్ హబ్గా తీర్చిదిద్దే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. తక్కువ పెట్టుబడి, ప్రభుత్వ రాయితీలు, ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే శక్తి పామాయిల్కు ఉన్నాయని, ఈ పంట సాగుతో స్థిర ఆదాయం పొందొచ్చని చెప్పారు. ఇవే అంశాలపై రైతుల్లో చైతన్యం కలిగించాలన్నారు. కార్యక్రమంలో అశ్వారావుపేట వ్యవసాయ సహాయ సంచాలకులు రవికుమార్, ఏఓలు చంద్రశేఖర రెడ్డి, శివరామ ప్రసాద్, అరుణ్బాబు, అనూష, వినయ్, నాయకులు కొయ్యల అచ్యుతరావు, కాసాని నాగప్రసాద్, ఎర్రా వసంతరావు, కోటగిరి బుచ్చిబాబు పాల్గొన్నారు.
వ్యవసాయాధికారులకు
మంత్రి తుమ్మల ఆదేశం