ఆదివాసీలందరికీ ఒకే చట్టం అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీలందరికీ ఒకే చట్టం అమలు చేయాలి

May 31 2025 12:22 AM | Updated on May 31 2025 12:22 AM

ఆదివాసీలందరికీ ఒకే చట్టం అమలు చేయాలి

ఆదివాసీలందరికీ ఒకే చట్టం అమలు చేయాలి

పాల్వంచరూరల్‌: దేశవ్యాప్తంగా ఉన్న ఆదివాసీ గిరిజనులందరికీ ఒకే చట్టాన్ని వర్తింపజేయాలని సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ భూక్యా భంగ్యానాయక్‌ అన్నారు. మండల పరిధిలోని కిన్నెరసాని గిరిజన ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్న తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్‌ బునియాది కార్యకర్త సమ్మేళన్‌ రెండో రోజుకు చేరుకుంది. శుక్రవారం ఆదివాసీ చట్టాలు, జీవనవిధానం, సంప్రదాయాలపై ప్రొఫెసర్‌ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రక్షణ చట్టాలపై గిరిజనులు అవగాహన పెంపొందించుకోవాలని చెప్పారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా గిరిజన చట్టాలు అమలుకు నోచుకోవడం లేదని అన్నారు. ప్రతీ గిరిజనుడు హక్కులు, చట్టాలపై ప్రశ్నించగలగాలని చెప్పారు. రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్‌, 1/70 చట్టం, పీసా చట్టాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో అటవీ అభివృద్ధి సంస్ధ చైర్మన్‌, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు పొదం వీరయ్య, ట్రైకార్‌ చైర్మన్‌ బెల్లయ్యనాయక్‌, ఏఐసీసీ ఇన్‌చార్జి రాహుల్‌ బాల్‌, గాదె ఇన్నయ్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు కిన్నెరసానికి మంత్రుల రాక

తెలంగాణ ఆదివాసీ కాంగ్రెస్‌ బునియాది కార్యకర్త సమ్మేళన్‌ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, రెవెన్యూ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, టీపీసీసీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌, టీపీసీసీ చీఫ్‌ మహేష్‌కుమార్‌గౌడ్‌ హాజరుకానున్నారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు వస్తారని, ఈ సందర్భంగా కిన్నెరసాని క్రీడా మైదానంలో వనమహోత్స కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటతారని నిర్వాహకులు తెలిపారు.

సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌

భూక్యా భంగ్యానాయక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement