మహిళలే అంబాసిడర్లు.. | - | Sakshi
Sakshi News home page

మహిళలే అంబాసిడర్లు..

May 30 2025 12:15 AM | Updated on May 30 2025 12:15 AM

మహిళల

మహిళలే అంబాసిడర్లు..

ఖమ్మంమయూరిసెంటర్‌: ‘మా వంతుగా మార్ట్‌ ఏర్పాటు చేసి ప్రచారం కల్పిస్తున్నాం.. మీరు తయారు చేసిన ఉత్పత్తులకు మీరే అంబాసిడర్లుగా విక్రయించుకోవడం, లాభాలు వచ్చేలా ముందుకు సాగే బాధ్యత మీదే’ అని ఖమ్మం కలెక్టర్‌ ముజమ్మిల్‌ఖాన్‌ పేర్కొన్నారు. ఖమ్మం వైరా రోడ్డులో ఏర్పాటుచేసిన మహిళా మార్ట్‌ను భద్రాద్రి కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌, ఖమ్మం సీపీ సునీల్‌దత్‌, భద్రాద్రి ఎస్పీ రోహిత్‌రాజ్‌, ఖమ్మం జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌తో కలిసి కలెక్టర్‌ గురువారం సందర్శించారు. మార్ట్‌ ఏర్పాటుకు దారి తీసిన అంశాలను కలెక్టర్‌ వారికి వివరించాక మహిళా సంఘాల సభ్యులు రూపొందించిన వస్తువులను అధికారులు ఆసక్తిగా పరిశీలించారు. ఈసందర్భంగా ఉమ్మడి జిల్లా అధికారులు మార్ట్‌లో పలు వస్తువులు కొనుగోలు చేశారు.

టీ బాగుంది.. నేనే పే చేస్తా..

మార్ట్‌ను సందర్శించాక ఆవరణలో ఏర్పాటుచేసిన క్యాంటీన్‌ను వద్దకు అధికారులంతా వచ్చారు. ఈ సందర్భంగా ఖమ్మం సీపీ సునీల్‌దత్‌ అందరినీ టీ తాగాలని కోరారు. ఆపై టీ బాగుందని నిర్వాహకురాలిని అభినందించిన ఆయన తన ఫోన్‌లో యాప్‌ ద్వారా డబ్బు చెల్లించారు.

మహిళా మార్ట్‌ను సందర్శించిన

ఉమ్మడి జిల్లా అధికారులు

మహిళలే అంబాసిడర్లు..1
1/1

మహిళలే అంబాసిడర్లు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement