ప్రపంచ శాంతే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి | - | Sakshi
Sakshi News home page

ప్రపంచ శాంతే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి

Jun 9 2025 10:16 AM | Updated on Jun 9 2025 10:16 AM

ప్రపంచ శాంతే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి

ప్రపంచ శాంతే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలి

చిలకలూరిపేట టౌన్‌: ప్రపంచ ప్రార్థనల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా ఉన్న వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ ప్రాంగణంలో భక్తి శోభ అలముకున్నది. ప్రతిరోజూ ఉదయాన్నే గత 49 రోజులుగా నిరంతరాయంగా ప్రార్థనలు నిర్వహించారు. ఆదివారం 50వ రోజుతో ఘనమైన ముగింపు పలికారు. ప్రత్యేక ప్రార్థనలతో ప్రపంచ ప్రార్థనల దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమ నిర్వాహకులు పాస్టర్‌ ఎంఎన్‌ మూర్తి (సూరిబాబు) అధ్యక్షతన జరిగిన ఈ ప్రార్థనల్లో నియోజకవర్గానికి చెందిన వివిధ క్రైస్తవ సంఘాల పాస్టర్లు, విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విశ్వశాంతి నెలకొనాలని, భారతదేశం ఐక్యంగా వర్ధిల్లాలని, శాంతి, భద్ర తల వాతావరణం నిరంతరం కొనసాగాలని వారు ప్రార్థించారు. దేశాభివృద్ధికి మానవీయ విలువలు అనుసరణీయమవ్వాలన్న ఆకాంక్షను ప్రార్థనల ద్వారా వెలిబుచ్చారు. ప్రార్థనలు ముగిశాక సంఘీభావానికి ప్రతీకగా ప్రేమవిందు ఏర్పాటు చేశారు. ప్రార్థనల్లో పాస్టర్లు ఎం.ఎన్‌. మూర్తి, ఎన్‌.థామస్‌, జి. బుజ్జి, బసికాపురం అబ్రహం, టి. క్రీస్తురాజు, ఎం. మోషే, ఎన్‌. అబ్రహం, బి. సుబ్బారావు, డి. జీవరత్నం, ఎన్‌. వసురాజు, పాల్‌సారఽథి, ఎస్‌. డేవిడ్‌, ఎస్‌. దావీదురాజు, విజయమేరీ నక్షత్రం, ఎం. జ్ఞానయ్య, సతీష్‌ కుమార్‌, ఎం. సంసోను, కె. శాంతిసాగర్‌, కోటి వీరయ్య, అన్నామణి, శారా, విజయ అనసూయ తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా ప్రపంచ ప్రార్థన దినోత్సవం నియోజకవర్గ దైవసేవకుల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థన గత 50 రోజులుగా ఉదయకాల ప్రార్థనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement