రైతు కుటుంబానికి పరామర్శ | - | Sakshi
Sakshi News home page

రైతు కుటుంబానికి పరామర్శ

Jun 9 2025 10:16 AM | Updated on Jun 9 2025 10:16 AM

రైతు కుటుంబానికి పరామర్శ

రైతు కుటుంబానికి పరామర్శ

జె.పంగులూరు: అప్పుల పాలై గత నెల 24న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న యువ రైతు తల్లపనేని శ్రీనాథ్‌ కుటుంబాన్ని ఆదివారం డీఎస్పీ మహ్మద్‌ మొయిన్‌, ఆర్‌డీఓ చంద్రశేఖర్‌ నాయుడు పరామర్శించారు. మృతికి గల కారణాలు అధికారులను, స్థానికుల నుంచి తెలుసుకున్నారు. గత సంవత్సరం 2.10 ఎకరాల పొగాకు, 2.50 ఎకరాల మిర్చి, 4.80 ఎకరాల మొక్కజొన్న సాగు చేసినట్లు తెలిపారు. పంటలు సరిగా పండక, దిగుబడులు రాక రూ. 18,68,437 వరకు శ్రీనాథ్‌ అప్పుల పాలైనట్లు చెప్పారు. ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ.6.50 లక్షలు, బ్యాంకుల నుంచి రూ. 11 లక్షలు అప్పులు తీసుకున్నట్లు తెలిపారు. అనంతరం ఆర్‌డీఓ చంద్రశేఖర్‌ నాయుడు మాట్లాడుతూ గ్రామంలో ఇంటి స్థలం, ఇల్లు కట్టుకునేందుకు రుణాన్ని మంజూరు చేయించాల్సిందిగా అధికారులకు సూచించారు. వివరాలు ప్రభుత్వానికి పంపించి న్యాయం జరిగే విధంగా చూస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సింగారావు, ఎస్‌ఐ వినోద్‌బాబు, ఏఓ సుబ్బారెడ్డి, ఆర్‌ఐ శ్వేత, వీఆర్‌ఓలు పావని, చింపారావు పాల్గొన్నారు.

కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్న అధికారులు రైతు తల్లపనేని శ్రీనాఽథ్‌ మృతికి గల కారణాలపై ఆరా ప్రభుత్వానికి ప్రతిపాదనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement