
గోళ్లమూడి చెరువును మోడల్గా అభివృద్ధి చేయాలి
పెదకాకాని: గోళ్లమూడి తాగునీటి చెరువును మోడల్గా అభివృద్ధి చేయాలని ఉపాధి హామీ పథకం రాష్ట్ర సంచాలకులు వైవీ షణ్ముఖకుమార్ అన్నారు. పెదకాకాని మండలం గోళ్లమూడి, ఉప్పలపాడు గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ పథకం నిర్వహణ పరిశీలన కోసం గురువారం రాష్ట్ర బృందం పర్యటించింది. షణ్ముఖ కుమార్ మాట్లాడుతూ గోళ్లమూడి గ్రామంలోని తాగునీటి చెరువును పల్లె పుష్కరిణి కింద చేపట్టి అభివృద్ధి చేయాలని సూచించారు. తాగునీటి అవసరాలపై గ్రామస్తులతో మాట్లాడారు. అనంతరం ఉప్పలపాడు గ్రామంలో పంట కుంట(ఫాం పాంట్స్) తవ్వుతున్న తీరును పరిశీలించారు. ఈ పనులపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రామికులకు రోజువారి వేతనం కనీసం రూ.290 ఉండేలా చూడాలన్నారు. పంట కుంట నిర్మాణం చేపట్టిన రైతులతో మాట్లాడి సూచన చేశారు. అనంతరం లాలుపురం గ్రామంలో పర్యటించారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ వి శంకర్, ఎంపీడీఓ రమావత్ శ్రీనివాసనాయక్ పాల్గొన్నారు.
ఉపాధి హామీ పథకం రాష్ట్ర సంచాలకులు షణ్ముఖకుమార్ గోళ్లమూడి, ఉప్పలపాడు గ్రామాల్లో పర్యటన