
అనుమతిలేని ప్లాట్లు కొనవద్దు
చీరాల టౌన్: చీరాల మండలంలోని గ్రామాల్లో ఎక్కడా అనుమతులు లేని అక్రమ లే–అవుట్లు వేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటుగా లే అవుట్ను చదును చేయిస్తామని తహసీల్దార్ కె. గోపికృష్ణ హెచ్చరించారు. మండలంలోని తోటవారిపాలెం వీరయ్యనగర్లో సచివాలయానికి సమీపంలో అనుమతులు లేకుండా వేసిన లే–అవుట్ను గురువారం రెవెన్యూ సిబ్బందితో చదును చేయించారు. భూ బదలాయింపు చేయకుండా, రెవెన్యూ అఽధికారుల అనుమతి లేకుండా అక్రమంగా లే అవుట్ను ఏర్పాటు చేయడంతో సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీంతో రెవెన్యూ అధికారులు స్పందించి తోటవారిపాలెంలో అక్రమంగా అనుమతులు లేకుండా వేసిన లే–అవుట్ను చదును చేయించి పొలం మాదిరిగా చేశారు. రియల్టర్లు అక్రమ వ్యాపారాలు చేయడానికి వీల్లేదని అనుమతులు తీసుకుని లే–అవుట్లు వేసుకోవాలన్నారు. నిబంధనలు విస్మరించినా, అక్రమంగా ప్లాట్లు వేసినా, భూములను ల్యాండ్ కన్వర్షన్ లేకుండా అమ్మకాలు చేసినా చర్యలు తీసుకుంటామన్నారు.
తోటవారిపాలెంలో అక్రమ లే–అవుట్ను చదును చేయించిన అధికారులు

అనుమతిలేని ప్లాట్లు కొనవద్దు