మేమంతా సిద్ధం బహిరంగ సభ అనంతరం సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్ర ప్రారంభించి కొండమోడు జంక్షన్, కోటనెమలిపురి, అనుపాలెం మీదుగా యాత్ర సాగింది. తనకోసం వేచి ఉన్న అభిమానులకు అభివాదం చేస్తూ యాత్ర ముందుకు సాగింది. అక్కడి నుంచి బెల్లంకొండ, రాజుపాలెం మీదుగా రెడ్డిగూడెం చేరగా అక్కడ వేచి ఉన్న మహిళలు, అభిమానులు బస్స ముందుకు వచ్చి కాసేపు ఆగాలని పట్టుబట్టారు. దీంతో బస్సు టాప్ పైకి వెళ్లి అందరికి అభివాదం చేసి ముందుకు సాగారు. ధూళిపాళ్ల శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస కేంద్రం వద్దకు రాత్రి 9.10 గంటలకు చేరుకోవడంతో మేమంతా సిద్ధం సభ 12 రోజు యాత్ర విజయవంతంగా ముగిసింది.
ధూళిపాళ్ల వద్ద రాత్రి బస..