యోగాంధ్రతో ఆరోగ్యాంధ్ర సాధించాలి | - | Sakshi
Sakshi News home page

యోగాంధ్రతో ఆరోగ్యాంధ్ర సాధించాలి

Jun 6 2025 6:01 AM | Updated on Jun 6 2025 6:01 AM

యోగాంధ్రతో ఆరోగ్యాంధ్ర సాధించాలి

యోగాంధ్రతో ఆరోగ్యాంధ్ర సాధించాలి

సిద్దవటం : యోగాంధ్ర ద్వారా జీవన శైలిలో మార్పులు పొంది ఆరోగ్యాంధ్ర సాధించాలని కడప ఆర్డీఓ జాన్‌ ఇర్విన్‌ తెలిపారు. మండల కేంద్రమైన సిద్దవటంలోని మట్లిరాజుల కోట పార్కు ప్రాంతంలో గురువారం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలలో ఆరోగ్యం పట్ల అవగాహన పెంచుతూ , రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన యోగాంధ్రలో భాగంగా సిద్దవటం మట్లిరాజుల కోటలో యోగాను ఏర్పాటు చేశామన్నారు. రోజుకు కేవలం 30 నిమిషాలు యోగా చేస్తే శారీరక దృఢత్వం, మానసిక శాంతి, సిద్ధిస్తాయన్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి యోగా ఒక ఉత్తమ మైన మార్గం అని ఆయన తెలిపారు. జిల్లా యోగా స్పెషల్‌ ఆఫీసర్‌ సురేష్‌ బాబు మాట్లాడుతూ ఇలాంటి యోగా కార్యక్రమాలు పాఠశాల స్థాయిలో నిర్వహించే యువతలో ఆరోగ్య చైతన్యం, పెరుగుతుందన్నారు. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి యోగా నిర్వహించడం ఒక ఉత్తమమైన మార్గం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో యోగా ట్రైనర్స్‌ మాధవి, ప్రసాద్‌, మెప్మా పీడీ కిరణ్‌కుమార్‌రెడ్డి, మండల స్పెషల్‌ ఆఫీసర్‌ జయసింహ, తహసీల్దారు తిరుమలబాబు, ఎంపీడీఓ ఫణిరాజకుమారి, ఎస్‌.ఐ మహమ్మద్‌రఫీ, వైద్యులు డాక్టర్‌ ప్రకాష్‌, డాక్టర్‌ రంగలక్ష్మి, డాక్టర్‌ మురళి, ఎస్‌. ఎం.డి హమీద్‌, పంచాయతీరాజ్‌ ఏఈ నాగరాజు, డిప్యూటీ తహసీల్దార్‌ మాధవీలత, ఈఓపీఆర్‌డీ మోహతాబ్‌ యాస్మిన్‌, వెలుగు ఏపీఎం సుజాత, సీసీలు, ఉపాధి ఏపీఓ నరసింహులు, గ్రామ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్‌ఓలు, బెటాలియన్‌ పోలీసులు, డ్వాక్రా మహిళలు, అంగన్‌వాడీ వర్కర్‌లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement