
జేఈఈ అడ్వాన్స్లో మెరిశారు
సాయి అనిష్ ప్రతిభ
సింహాద్రిపురం: జేఈఈ అడ్వా న్స్ పరీక్షా ఫలితాలలో పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురంకు డాక్టర్ శివన్నారాయణరెడ్డి, డాక్టర్ మాధవి రెడ్డిల కుమారుడు సాయి అనిష్రెడ్డి ప్రతిభ కనబరిచాడు. ఆల్ ఇండియా స్థాయిలో 100వ ర్యాంకు సాధించారు. ఐఏఎస్ కావడమే తన లక్ష్యమని సాయి అనిష్రెడ్డి తెలిపారు.
● సింహాద్రిపురానికి చెందిన నాగిరెడ్డి సుధాకర్రెడ్డి, నవీనాల కుమారుడు నాగిరెడ్డి లిఖిత్రెడ్డి ఆల్ ఇండియా స్థాయిలో 512వ ర్యాంక్ సాధించారు.లిఖిత్రెడ్డి ప్రతిభ చూపడంపట్ల గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.
రాణించిన మధుమన్మోహిత్
వల్లూరు(చెన్నూరు): జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షా ఫలితాల్లో చెన్నూరు మండలంలోని కొక్కరాయపల్లె గ్రామానికి చెందిన మధు మన్మోహిత్ రెడ్డి ఉత్తమ ప్రతిభ కనబరిచి ఆల్ ఇండియా స్థాయిలో 303 వ ర్యాంక్ సాధించాడు. మధు మన్మోహిత్ రెడ్డి తల్లి ప్రశాంతి పశు సంవర్థక శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేస్తుండగా, తండ్రి మధు వేణు గోపాల్ రెడ్డి కాంట్రాక్టర్గా పని చేస్తున్నాడు. హైదరాబాద్లోని ఓ కళాశాలలో ఇంటర్ చదివిన మధు మన్మోహిత్ రెడ్డి జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో కెమిస్ట్రీ సబ్టెక్టులో 80 మార్కులు, ఫిజిక్స్లో 87 మార్కులు, మ్యాథ్స్లో 82 మార్కులతో మొత్తం 249 మార్కులు సాధించాడు. దీంతో ఇతడు సీఆర్ఎల్ ర్యాంకు 303 సాఽధించాడు. ఐఏఎస్ కావడమే తన లక్ష్యంగా తెలిపాడు. తమ కుమారుడు జేఈఈ అడ్వాన్స్డ్ లో ఉత్తమ ర్యాంకు సాధించడం పట్ల అతని తల్లిదండ్రులు మధు వేణుగోపాల్ రెడ్డి, ప్రశాంతిలు ఆనందం వ్యక్తం చేశారు. కాగా అతడు ఇంటర్లో 991 మార్కులు సాధించాడు.
కృష్ణహర్షిత్కు 139వ ర్యాంకు
సిద్దవటం: జేఈఈ అడ్వాన్స్ ఫలితాల్లో సిద్దవటానికి చెందిన మంచాల కృష్ణ హర్షిత్ జనరల్ కేటగిరీలో ఆల్ ఇండియాలో 139వ ర్యాంకు సాధించారు. ఈయన తండ్రి మంచాల ఈశ్వరయ్య కడపలోని జిల్లా పరిషత్ హైస్కూల్లో గణిత ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. తల్లి రాధిక గృహిణి తమ కుమారుడు కృషి, పట్టుదలతో జేఈఈలో మంచి ర్యాంకు సాధించినందుకు తల్లిదండ్రులు కుమారుడికి అభినందించారు. సాఫ్ట్వేర్ రంగంలో అత్యున్నత నైపుణ్యం పొంది, ఏ1లో ఉన్నతంగా రాణించాలన్నదే తన లక్ష్యమని ర్యాంకర్ మంచాల కృష్ణ హర్షిత్ తెలిపారు.
ఇటివల నిర్వహించిన జేఈఈ
అడ్వాన్స్డ్ పరీక్షల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. ఇందులో జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కష్టపడి చదివారు. ఆల్ ఇండియా స్థాయిలో ర్యాంకులు సాధించారు.
పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రి
పురానికి చెందిన సాయి అనిష్ రెడ్డి, నాగిరెడ్డి
లిఖిత్రెడ్డి, సిద్ధవటానికి చెందిన కృష్ణహర్షిత్, చెన్నూరు మండలం కొక్కరాయపల్లె గ్రామానికి చెందిన మధు మన్మోహిత్ రెడ్డిలు మంచి ర్యాంకులతో మెరిశారు.

జేఈఈ అడ్వాన్స్లో మెరిశారు

జేఈఈ అడ్వాన్స్లో మెరిశారు

జేఈఈ అడ్వాన్స్లో మెరిశారు