
ఏసీఏ అండర్–23 వన్డే క్రికెట్ టోర్నీ ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ఏసీఏ సౌత్ జోన్ అండర్–23 వన్డే క్రికెట్ టోర్నమెంట్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో ప్రారంభం రోజు అనంతపురం, నెల్లూరు జట్ల మధ్య మొదటి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో నెల్లూరు జట్టు మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అనంతపురం జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 49.0 ఓవర్లలో 230 పరుగులకు అన్ని వికెట్లు కోల్పోయింది. ఆ జట్టులోని కే. హెచ్. వీరారెడ్డి 47, పి. వికాస్ 42 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని ఎన్. భార్గవ్ 4, ఎస్ అఖిల్ సాలుంకే 3, ఎన్. మాధవ్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 231 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన నెల్లూరు జట్టు 36.1 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసి 3 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ జట్టులోని జి. మన్విత్ రెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ ప్రదర్శించి సెంచరీ చేశారు. 77 బంతులను ఎదుర్కొని 109 పరుగులు చేశాడు. ఎస్. ఆతిక్ సల్మాన్ 33 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని జి. మల్లికార్జున 2, ఎం. దీపక్ 2, షేక్ కామిల్ 2 వికెట్లు తీసుకున్నారు.
వైయస్ రాజారెడ్డి ఏసీఏ స్టేడియంలో..
కడప జట్టు విజయం
వైయస్ రాజారెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఏసీఏ సౌత్ జోన్ అండర్ –23 వన్డే క్రికెట్ టోర్నీలో భాగంగా ప్రారంభమైన మ్యాచ్లో కడప జట్టు 21 పరుగుల తేడాతో కర్నూలు జట్టుపై విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన కడప జట్టు 45.0 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 236 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఎం. వాసుదేవరాజు 99, సి విజయ్ రామ్రెడ్డి 61 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని పి. సాబ్జాన్ బాషా అద్భుతంగా బౌలింగ్ ప్రదర్శించి 5 వికెట్లు తీసుకున్నాడు. సూర్య తేజ రెడ్డి 2 వికెట్లు తీశాడు. అనంతరం 237 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన కర్నూలు జట్టు 45.0 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 215 పరుగులు చేసి ఓటమి చవిచూసింది. ఆ జట్టులోని టి.తౌఫిక్ హుస్సేన్ 41, మనోజ్ రాజు 66 పరుగులు చేశారు. కడప జట్టులోని షేక్ ఆదిల్ హుస్సేన్ 4 వికెట్లు తీసుకున్నాడు.
తొలి రోజు మ్యాచ్లో
నెల్లూరు, కడప జట్ల విజయం

ఏసీఏ అండర్–23 వన్డే క్రికెట్ టోర్నీ ప్రారంభం

ఏసీఏ అండర్–23 వన్డే క్రికెట్ టోర్నీ ప్రారంభం

ఏసీఏ అండర్–23 వన్డే క్రికెట్ టోర్నీ ప్రారంభం