అక్రమ మద్యం తరలింపుపై నిఘా | Sakshi
Sakshi News home page

అక్రమ మద్యం తరలింపుపై నిఘా

Published Thu, May 9 2024 7:35 AM

-

పీలేరు : అక్రమ మద్యం తరలింపుపై నిఘా పెంచామని రాయలసీమ జోన్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో డిప్యూటీ కమిషనర్‌ టి.విజయశేఖర్‌ అన్నారు. స్థానిక సెబ్‌ కార్యాలయాన్ని బుధవారం ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. అనంతరం చిత్తూరు రోడ్డు మార్గంలో చెక్‌ పోస్ట్‌ వద్ద వాహనాలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం అక్రమంగా తరలించకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండెక్ట్‌, సెబ్‌ అధికారులు పాటించాల్సిన నియమ నిబంధనల గురించి తగు సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెబ్‌ సీఐ శ్యాంప్రసాద్‌, ఎస్‌ఐ లక్ష్మీనరసయ్య, సిబ్బంది యోగానంద, గిరిబాబు, సుధాకర, సురేష్‌, రమేష్‌, జయభాను, గంగా మహేశ్వరి పాల్గొన్నారు.

Advertisement
Advertisement