
నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో 8 కేంద్రాలు, బెంగళూరులో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రోజూ రెండు విడతలుగా ఈనెల 30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. డీఈఓ పరిధిలోని కేంద్రాలకు పరిశీల కులుగా జాయింట్ డైరెక్టర్ సుబ్బారావును నియమించారు. పరీక్షలయ్యేదాకా ఆయన ఇక్కడే ఉంటూ కేంద్రాలను పరిశీలించనున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. అన్ని కేంద్రాలకు డిపార్ట్ మెంట్ అధికారులను నియమించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు. అభ్యర్థులు గంటన్నర ముందే కేంద్రాలకు చేరుకోవాలని కోరారు.
డీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు
అనంతపురం అర్బన్: డీఎస్సీ పరీక్షలకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వి.వినోద్కుమార్ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఏడు కేంద్రాల్లో శుక్రవారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. నగరంలో ఏడు కేంద్రాలు, గుత్తి, తాడిపత్రి పట్టణాల్లో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేశామన్నారు. రెండు సెషన్లుగా పరీక్ష జరుగుతుందన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు. డీఎస్సీ నిర్వహణకు జిల్లా రెవెన్యూ అధికారి ఇన్చార్జ్గా వ్యవహరిస్తారన్నారు. కేంద్రానికి ఒకరు చొప్పున ఏడు కేంద్రాలకు డిప్యూటీ కలెక్టర్లను ఇన్చార్జ్లుగా నియమించామన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. డిప్యూటీ కలెక్టర్లు రోజూ పరీక్ష కేంద్రాలు తనిఖీ చేయాలని చెప్పారు. తాను కూడా పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తానన్నారు. ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డీఆర్ఓ ఎ.మలోల, డీఎస్పీ వెంకటేషులు, డీఈఓ ప్రసాద్బాబు, కలెక్టరేట్ ఏఓ అలెగ్జాండర్, ఎస్పీడీసీఎల్ ఎస్ఈ శేషాద్రి శేఖర్, ఇతర అధికారులు పాల్గొన్నారు
జిల్లా పరిశీలకులుగా జేడీ సుబ్బారావు