ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌ హామీల డప్పు కొట్టి.. అధికారంలోకి వచ్చాక సామాన్యులు, పేదల పొట్టకొట్టిన కూటమి సర్కారు వెన్నుపోటుకు నేటితో ఏడాది పూర్తయింది. సరిగ్గా 2024 జూన్‌ 4వ తేదీన ‘కూటమి’కి అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ‘మా హామీలు మీ జీవితాలనే మార్చేస | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌ హామీల డప్పు కొట్టి.. అధికారంలోకి వచ్చాక సామాన్యులు, పేదల పొట్టకొట్టిన కూటమి సర్కారు వెన్నుపోటుకు నేటితో ఏడాది పూర్తయింది. సరిగ్గా 2024 జూన్‌ 4వ తేదీన ‘కూటమి’కి అనుకూలంగా ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ‘మా హామీలు మీ జీవితాలనే మార్చేస

Jun 4 2025 12:29 AM | Updated on Jun 4 2025 12:29 AM

ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌ హామీల డప్పు కొట్టి.. అధికా

ఎన్నికల ముందు సూపర్‌ సిక్స్‌ హామీల డప్పు కొట్టి.. అధికా

సాక్షి ప్రతినిధి, అనంతపురం: కూటమి ప్రభుత్వం వచ్చాక ఉమ్మడి జిల్లాలో ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందలేదు. ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అందరికీ తల్లికి వందనం ఇస్తామని మోసగించారు. 50 ఏళ్లు నిండిన బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు నెలకు రూ.1,500 ఇస్తామని నేడు ఆ విషయమే పట్టించుకోవడం లేదు. సంవత్సరానికి 3 గ్యాస్‌ సిలిండర్లు ఇస్తామని చెప్పి మోసం చేశారు. ఉచిత బస్సుకు ముహూర్తమే ఖరారు కాలేదు. ‘ఇంటింటికీ ఉద్యోగమిస్తాం.. ఉద్యోగం ఇవ్వకపోతే నెలకు రూ.3 వేలు భృతి’ అన్నా నేటికీ అతీగతీ లేకుండా పోయింది. ప్రతి రైతుకూ ఏటా రూ.20 వేలు ఇస్తామని ఇప్పటివరకూ పైసా ఇవ్వలేదు.

సామాన్యుల బెంబేలు..

అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు నెరవేర్చకపోగా ఎమ్మెల్యేలు, పోలీసులు, టీడీపీ కార్యకర్తలు, సామాన్యులపై భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. కబ్జాలు, ఆక్రమణలు, దందాలు, అక్రమ వసూళ్లకు అంతులేకపోవడంతో జనం బెంబేలెత్తుతున్నారు.

● కొత్త మద్యం పాలసీ పేరుతో ఊరూరా బెల్టుషాపులు, పర్మిట్‌ రూములతో ఉమ్మడి అనంత జిల్లాను మత్తులో జోగేలా చేశారు.

● హిందూపురంలో బాలకృష్ణ పీఏల అండ చూసుకుని ఇసుక మాఫియా రెచ్చిపోతోంది.

● ఫ్యాక్షన్‌ హత్యలు మళ్లీ పురుడుపోసుకున్నాయి. రామగిరి మండలంలో కురుబ లింగమయ్యను పచ్చ మూకలు కొట్టి చంపాయి. రాప్తాడులో నారాయణరెడ్డి, ముత్యాలమ్మను టీడీపీ నేతలు నరికి చంపారు.

● ఉమ్మడి జిల్లాలో కొండలు, గుట్టల్ని ‘తమ్ముళ్లు’ పిండిచేసి సహజ వనరులను లూటీ చేస్తున్నారు.

● చిత్రావతి, పెన్నా, వేదవతి హగరి నదుల్లో అక్రమంగా ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నా పట్టించుకునే దిక్కు లేదు.

● వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారు.

● అనంతపురం అర్బన్‌లో ఎవరైనా ఇళ్లు కట్టాలంటే ఎమ్మెల్యేకు ట్యాక్స్‌ కట్టాల్సిన పరిస్థితి.

● మట్కా, గంజాయికి తాడిపత్రి నియోజకవర్గం అడ్డాగా మారిపోయింది.

● గుత్తిలో ఓ వ్యక్తిని టీడీపీ నేతలు రైలు పట్టాలపై పడుకోబెట్టి డబ్బు దండుకున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

● రాప్తాడులో వెంచర్లు, పరిశ్రమలు ఏర్పాటు చేయాలంటే డబ్బు ముట్టజెప్పాలని చెబుతుండటంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు అటువైపు చూడటమే మానేశారు.

గమనిక: చంద్రబాబు ప్రభుత్వంలో వీరిలో ఒక్కరికీ రూపాయి

లబ్ధి చేకూరలేదు..

అలవిగాని హామీలతో లక్షలాది మందికి కుచ్చుటోపీ

ఎన్నికల ముందు ఊరూరా ‘సూపర్‌సిక్స్‌’ ప్రచారం

అధికారంలోకి వచ్చాక ఒక్క పథకమూ అమలు చేయని వైనం

పైగా కబ్జాలు, ఆక్రమణలు, మోసాలు, దోపిడీలతో భయభ్రాంతులు

‘కూటమి’ పాలనను ఎండగడుతూ నేడు వైఎస్సార్‌ సీపీ నిరసన ర్యాలీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement