
రాయితీ విత్తనాలకు కత్తెర..
రాయితీపై ఇచ్చే విత్తనాలకు కూడా కత్తెర వేశారు. అలాగే రాయితీ కూడా కుదించి రైతులపై భారం మోపారు. ఈ రబీలో కేవలం 25 శాతం సబ్సిడీతో పప్పుశనగ అందించడంతో జిల్లా రైతులపై రూ.6 కోట్ల వరకు అదనపు భారం పడింది. ఇక ఖరీఫ్లో విత్తన వేరుశనగ, కందులు నామమాత్రంగా అందించారు. 80 శాతం రాయితీతో ప్రత్యామ్నాయం అంటూ 27 వేల క్వింటాళ్లకు గానూ 10 వేల క్వింటాళ్లతో సరిపెట్టారు. ఈ ఖరీఫ్లో కేవలం 50 వేల క్వింటాళ్లు మాత్రమే విత్తన ప్రణాళిక తయారు చేశారు.
● వైఎస్ జగన్ ప్రభుత్వం 40 శాతం రాయితీతో విత్తనం అందించింది. ఐదేళ్లలో అన్ని రకాలకు చెందిన 6.70 లక్షల క్వింటాళ్ల విత్తనాలపై రూ.289 కోట్లు రాయితీ కల్పించడం గమనార్హం.