తప్పులతడక..గందరగోళం | - | Sakshi
Sakshi News home page

తప్పులతడక..గందరగోళం

May 28 2025 11:41 AM | Updated on May 28 2025 11:41 AM

తప్పులతడక..గందరగోళం

తప్పులతడక..గందరగోళం

కుప్పలు తెప్పలుగా విన్నపాలు

అనంతపురం ఎడ్యుకేషన్‌: స్కూల్‌ అసిస్టెంట్‌ నుంచి ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతుల కోసం అధికారులు రూపొందించిన సీనియార్టీ జాబితా గందరగోళంగా మారిందంటూ టీచర్లు వాపోతున్నారు. కామన్‌ సీనియారిటీ లెక్కించేటప్పుడు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పొందిన వారికి వారి ర్యాంకుల ప్రకారం వివిధ సబ్జెక్ట్‌లను కలుపుతూ జాబితా తయారు చేస్తారు. కానీ ఎస్జీటీ నుంచి పాఠశాల సహాయకులుగా ముఖ్యంగా ఒకే డీఎస్సీలో ఎస్జీటీగా ఎన్నికై ఒకేరోజు పదోన్నతి పొందిన స్కూల్‌ అసిస్టెంట్లతో ఉమ్మడి సీనియార్టీ తయారు చేసేటప్పుడు వారి ఫీడర్‌ కేటగిరీ (ఎస్జీటీ) లో మెరిట్‌ను ప్రాతిపదికగా తీసుకుంటారు. అయితే, ప్రస్తుత పదోన్నతుల్లో ఈ విధానాన్ని పక్కనపెట్టడంతో సీనియర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందంటున్నారు.

మెరిట్‌కు మంగళం...

1994 డీఎస్సీలో ఎస్జీటీగా ఎంపికై ...2002 నవంబరులో స్కూల్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందిన వారి సీనియార్టీ జాబితాలో పరిశీలిస్తే.. డీఎస్సీలో 36వ మెరిట్‌ ర్యాంకుగా ఉన్న టీచరు కంటే కూడా 397 ర్యాంకు టీచరును ముందు పెట్టారు. 99వ ర్యాంకు పొందిన టీచరుకంటే కూడా 161, 378, 141, 373 ర్యాంకు టీచర్లు ముందున్నారు. ఈ ఐదుగురూ (99,161,378,141,373 ర్యాంకర్లు) కూడా 36 ర్యాంకు టీచరుకంటే ముందున్నారు. అందరూ ఓపెన్‌ కేటగిరీ టీచర్లు కావడం విశేషం.

కోర్టుకు వెళ్లే ఆలోచనలో టీచర్లు

హెచ్‌ఎం పదోన్నతులకు తయారు చేసిన సీనియార్టీ జాబితాలో మెరిట్‌ను తుంగలో తొక్కి, సీనియర్లకు అన్యాయం చేయడంపై బాధిత టీచర్లు హైకోర్టును ఆశ్రయించేందుకు సమాయత్తమవుతున్నారు. 20 ఏళ్లకు పైగా ప్రమోషన్స్‌ లేక ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులను ‘వింత పద్ధతి’ దెబ్బ తీస్తోందంటూ వాపోతున్నారు.

హెచ్‌ఎంల సీనియార్టీ పదోన్నతుల జాబితాలో తప్పులు

పట్టించుకోని అధికారులు.. కోర్టుకెళ్తామంటున్న బాధిత టీచర్లు

ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌కు సంబంధించి విన్నపాలు కుప్పలు తెప్పలుగా వస్తున్నాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే సమయంలో జరిగిన పొరబాట్లు, సాంకేతిక సమస్య కారణంగా చాలామందికి అర్హత ఉన్నా కూడా వివిధ పాయింట్లు నమోదు కాలేదు. కొందరు దరఖాస్తు సమయంలో పొరబాట్లు చేశారు. ఈ కారణంగా వారికి నిబంధన మేరకు రావాల్సిన పాయింట్ల కంటే తక్కువ నమోదయ్యాయి. అర్హత ఉండీ రావాల్సిన పాయింట్ల కంటే తక్కువ రావడంతో ఆందోళన చెందుతూ డీఈఓల వద్దకు టీచర్లు పరుగులు తీస్తున్నారు.

పని చేయని ఆన్‌లైన్‌ గ్రీవెన్స్‌ సెల్‌

ప్రతి టీచరూ వ్యక్తిగత ట్రాన్స్‌ఫర్‌ లాగిన్‌లో వెళ్తే...అక్కడ గ్రీవెన్స్‌ ఆప్షన్‌ ఉంచారు. ఆప్షన్‌ ఓపెన్‌ చేసి తమ సమస్య విన్నవించుకోవచ్చు. అయితే ఎన్నిమార్లు ప్రయత్నించినా ‘ఎనేబుల్‌’ కాలేదని చూపుతోంది. ఈ క్రమంలో ఉపాధ్యాయులు డీఈఓతో పాటు వారి పరిధిలోని ఎంఈఓలను కలిసి విన్నవిస్తున్నారు. ఎంఈఓలు తమ లాగిన్‌లో అప్లికేషన్లు ఓపెన్‌ అయిన వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఫార్వర్డ్‌ చేసేస్తున్నారు. ఎడిట్‌ ఆప్షన్‌ ఉన్నా...పరిష్కరించే సమయం లేక వెంటనే ఆమోదం తెలుపుతున్నారు. డీఈఓ లాగిన్‌కు రాగానే ఇక్కడి ఐటీ ఉద్యోగులు కూడా అదే స్పీడ్‌తో ఆమోదం తెలుపుతుండటం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement