
జేఎన్టీయూ విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్షిప్
అనంతపురం: జేఎన్టీయూ(ఏ) విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంను అందుబాటులోకి తెచ్చినట్లు ఆ వర్సిటీ వీసీ డాక్టర్ హెచ్.సుదర్శనరావు తెలిపారు. ఇందు కోసం హైదరాబాద్లోని స్మార్ట్ బ్రిడ్జ్ ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు వివరించారు. ఒప్పందంలో భాగంగా ఎక్స్పీరిన్సియల్ లర్నింగ్, వర్చువల్ ఇంటర్న్షిప్ను విద్యార్థులకు అందించనున్నట్లు పేర్కొన్నారు. జేఎన్టీయూ (ఏ) విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరమని అభిప్రాయపడ్డారు. సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకునేలా సాఫ్ట్స్కిల్స్ అభ్యసించేందుకు కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఓఎస్డీ టూ వీసీ ఆచార్య ఓ.దేవన్న, రిజిస్ట్రార్ ఎస్. కృష్ణయ్య, డీఏపీ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ, ప్రొఫెసర్ సి.శోభాబిందు, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి.చెన్నారెడ్డి, స్మార్ట్ బ్రిడ్జి ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రతినిధులు శ్రీ దేవి సిరా పాల్గొన్నారు.