
కేటాయింపులు, సబ్సిడీ పెంచాలి
కరువు పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత తరుణంలో విత్తన కేటాయింపులు తగ్గించడం రైతులను ఇబ్బందులకు గురి చేయడమే. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయమూ అందక ఇప్పటికే సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నారు. విత్తన వేరుశనగ, ఇతర విత్తనాలు 90 శాతం సబ్సిడీతో ఇవ్వాలి. కేటాయింపులు బాగా పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒక్కో రైతుకు ఐదు బస్తాల విత్తనకాయలు ఇవ్వాలి. నష్టపోయిన రైతులకు పంటల బీమా కింద పరిహారం, ఇన్పుట్ సబ్సిడీ ప్రకటించాలి. – ఆర్.చంద్రశేఖర్రెడ్డి, సీపీఎం అనుబంధ
రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి