
●ఉక్కపోత.. ఉక్కిరిబిక్కిరి
అనంతపురం మెడికల్: ధ్రువీకరణ పత్రాల రీ వెరిఫికేషన్ ప్రక్రియ టీచర్లు, దివ్యాంగులను ఉక్కిరిబిక్కిరి చేసింది. గురువారం ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి మెడికల్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్తో పాటు దివ్యాంగుల సదరం సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరిగింది. డీఈఐసీ, బర్న్స్, ఆప్తాల్మిక్ వార్డుల్లో ఉపాధ్యాయుల సర్టిఫికెట్లు పరిశీలించారు. మొదటి రోజు జిల్లాకు చెందిన 500 మందికిపైగా ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఇక.. సదరం సర్టిఫికెట్లకు సంబంధించి ఈఎన్టీ, సైకీయాట్రీ వార్డులో పక్రియ చేపట్టారు. తగిన ఏర్పాట్లు లేకపోవడంతో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దివ్యాంగులు ప్రత్యక్ష నరకం చూశారు. ఉక్కపోతతో అల్లాడిపోయారు. నడవలేని స్థితిలో ఉన్న వారిని మోసుకుంటూ కుటుంబసభ్యులు అష్టకష్టాలు పడ్డారు. పగవానికి కూడా ఇలాంటి ఇబ్బంది రాకూడదని పలువురు వాపోయారు. వేలాది మంది వస్తారని తెలిసినా కేవలం 20 మంది కూర్చొనేందుకు చైర్లు వేశారు. ఈ క్రమంలో చేసేది లేక చాలా మంది చెట్ల కింద కూర్చున్నారు. దీనికితోడు తాగునీటి సౌకర్యం కూడా సరిగా కల్పించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎండల తాకిడి అధికంగా ఉన్న నేపథ్యంలోనూ ఆస్పత్రి ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది.

●ఉక్కపోత.. ఉక్కిరిబిక్కిరి

●ఉక్కపోత.. ఉక్కిరిబిక్కిరి

●ఉక్కపోత.. ఉక్కిరిబిక్కిరి

●ఉక్కపోత.. ఉక్కిరిబిక్కిరి