
జేఈఈ అడ్వాన్స్డ్లో దొండపూడి విద్యార్థి ప్రతిభ
రావికమతం : మండలంలోని దొండపూడి గ్రామానికి చెందిన అడ్డూరి లీలా గణేష్ జేఈఈ అడ్వాన్స్డ్ ఆల్ ఇండియా ఓబీసీ కేటగిరిలో 2839 ర్యాంక్ సాధించాడు. లీలా గణేష్ విశాఖపట్నం శ్రీ విశ్వ కాలేజ్లో ఇంటర్ చదివాడు. ఇంటర్ ఎంపీసీలో 985 మార్కులు సాధించాడు. తల్లిదండ్రులు అడ్డూరి శ్రీను, సరోజిని సాధారణ రైతు కుటుంబానికి చెందినవారు. లీలా గణేష్ పదో తరగతి వరకు దొండపూడి ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో 578 మార్కులు సాధించి మండలంలో రెండో స్థానంలో నిలిచాడు. అప్పటి వైఎస్సార్ ప్రభుత్వంలో జగనన్న అణిముత్యాలు అవార్డును మాజీ ప్రభుత్వ విప్ ధర్మశ్రీ చేతుల మీదుగా అందుకున్నాడు. గణేష్ జేఈఈ అడ్వాన్స్డ్లో మంచి ర్యాంక్ సాధించడంతో ఆ విద్యార్థిని కాలేజి అధ్యాపకులు, గ్రామ పెద్దలు అభినందించారు.