
హెచ్ఎంలుగా బాధ్యతలు.. 24 గంటల్లోనే రిటైర్డ్
అనకాపల్లి టౌన్: పదోన్నతి పొందిన 24 గంటల్లోనే ఇద్దరు ప్రధానోపాధ్యాయులు పదవీ విరమణ పొందారు. శనివారం వీరిని భీమునిగుమ్మం పాఠశాలలో జరిగిన సన్మాన కార్యక్రమంలో డీఈవో గిడ్డి అప్పారావునాయుడు అభినందించారు. అనకాపల్లి పట్టణం రామాపురం ఎంపీయూపీ స్కూలులో బీ కోటేశ్వరరావు, ఎస్. రాయవరం మండలం కొరుప్రోలు హైస్కూల్లో డీఏఎన్ మూర్తి ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. వీరికి అనూహ్యంగా పదోన్నతులు కల్పిస్తూ విద్యా శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి. ఈ మేరకు కోటేశ్వరావుకు ఎస్ రాయవరం మండలం ధర్మవరం అగ్రహారం, డీఏఎన్ మూర్తికి రేవుపోలవరం జెడ్పీ హైస్కూళ్లలో గ్రేడ్ –2 ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి రావడంతో వారిద్దరూ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. అయితే విచిత్రంగా 24 గంటల్లోనే పదవీ కాలం పూర్తి కావడంతో ఒక రోజు హెచ్ఎంలుగా మిగిలిపోయారు.